నేటి నుంచి కర్ఫ్యూ ఎత్తివేసిన సౌదీ అరేబియా
- June 21, 2020
రియాద్:మహమ్మారి కరోనా వైరస్ నేపథ్యంలో 3 నెలల పాటు దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించిన గల్ఫ్ కంట్రీ సౌదీ అరేబియా.. నేటి నుంచి కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే ఇవాళ్టితోనే యధావిధిగా ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతాయని తెలిపింది. ఇవాళ ఉదయం 6 గంటల నుంచే కర్ఫ్యూ ఆంక్షలు తొలిగిస్తున్నట్లు సౌదీ అంతర్గత మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కానీ... మతపరమైన తీర్థయాత్రలు, అంతర్జాతీయ ప్రయాణాలు, సామాజిక సమావేశాలు(50 మందికి మించకుండా) తదితర అంశాలపై ఆంక్షలు అలాగే కొనసాగుతాయని చెప్పింది.
మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు సౌదీ మార్చిలో దేశవ్యాప్తంగా కర్ఫ్యూ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. కొన్ని నగరాలు, పట్టణాల్లో ఏకంగా 24 గంటల పాటు కర్ఫ్యూ విధించింది కూడా. ఇక మేలో మూడు దశల్లో కర్ఫ్యూ ఆంక్షలను తొలగించనున్నట్లు ప్రకటించిన సౌదీ... జూన్ 21తో పూర్తిగా కర్ఫ్యూను తొలగించింది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







