నేటి నుంచి కర్ఫ్యూ ఎత్తివేసిన సౌదీ అరేబియా
- June 21, 2020
రియాద్:మహమ్మారి కరోనా వైరస్ నేపథ్యంలో 3 నెలల పాటు దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించిన గల్ఫ్ కంట్రీ సౌదీ అరేబియా.. నేటి నుంచి కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే ఇవాళ్టితోనే యధావిధిగా ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతాయని తెలిపింది. ఇవాళ ఉదయం 6 గంటల నుంచే కర్ఫ్యూ ఆంక్షలు తొలిగిస్తున్నట్లు సౌదీ అంతర్గత మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కానీ... మతపరమైన తీర్థయాత్రలు, అంతర్జాతీయ ప్రయాణాలు, సామాజిక సమావేశాలు(50 మందికి మించకుండా) తదితర అంశాలపై ఆంక్షలు అలాగే కొనసాగుతాయని చెప్పింది.
మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు సౌదీ మార్చిలో దేశవ్యాప్తంగా కర్ఫ్యూ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. కొన్ని నగరాలు, పట్టణాల్లో ఏకంగా 24 గంటల పాటు కర్ఫ్యూ విధించింది కూడా. ఇక మేలో మూడు దశల్లో కర్ఫ్యూ ఆంక్షలను తొలగించనున్నట్లు ప్రకటించిన సౌదీ... జూన్ 21తో పూర్తిగా కర్ఫ్యూను తొలగించింది.
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







