దుబాయ్:జూలై 7 నుండి విదేశీ పర్యాటకులకు అనుమతి
- June 21, 2020
దుబాయ్: జూలై 7 నుండి దుబాయ్ ఎయిర్పోర్ట్స్ పర్యాటకులను అనుమతిస్తారని ఆదివారం ప్రకటించారు.పర్యాటకులు కోవిడ్ -19 నెగటివ్ సర్టిఫికేట్ను సమర్పించాలి లేదా విమానాశ్రయంలో పరీక్షలు చేయవలసి ఉంటుంది.దుబాయ్ ఎయిర్పోర్ట్స్ రేపటి నుండి విదేశాలలో చిక్కుకున్న నివాసితులను యూ.ఏ.ఈ రావటానికి అనుమతిస్తారని సుప్రీం కమిటీ తెలిపింది. జూన్ 23 నుండి పౌరులు మరియు నివాసితులను విదేశాలకు వెళ్లడానికి అనుమతించారని కూడా తెలిపింది.
దుబాయ్ ఎయిర్పోర్ట్స్ నుండి ప్రయాణించే పౌరులు, నివాసితులు మరియు పర్యాటకుల కోసం కమిటీ కొత్త ప్రోటోకాల్స్ మరియు షరతులను ప్రకటించారు.
కోవిడ్ -19 మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా విమానాల రాకపోకల పై ఆంక్షల వల్ల ప్రభావితమైన వేలాది మందికి వారి ప్రయాణ ప్రణాళికలను తిరిగి ప్రారంభించడానికి ఈ ప్రకటనలు అనుమతిస్తాయని కమిటీ తెలిపింది.
యూ.ఏ.ఈ వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఈ నిర్ణయాలు ప్రకటించబడ్డాయి.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







