అద్దె వివాదం: 16 కుటుంబాల ఇబ్బందులు
- February 02, 2016
అజ్మన్లో ఓ అపార్మెంట్ ఓనర్, అద్దెకు ఉంటోన్నవారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న ఘటన వెలుగు చూసింది. ఐదు అంతస్తులు గల ఆ భవనంలో మొత్తం 16 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. అయితే సౌకర్యాల పేరుతో అదనంగా అద్దెలను పెంచేందుకు ప్రయత్నిస్తున్న ఓనర్, దాన్ని వ్యతిరేకిస్తున్న కుటుంబాలపై కక్ష సాధింపు చర్యలకు పూనుకున్నాడు. అపార్ట్మెంట్లో లిఫ్ట్ వాడకుండా చేయడం, కరెంటు, నీటి సరఫరా నిలిపివేయడంతో బాధిత కుటుంబాలు రెంట్ డిస్ప్యూట్ కమిటీని ఆశ్రయించింది. నాలుగో అంతస్థులో ఉంటున్న ఓ కుటుంబం, రోజూ తమ పిల్లల్ని స్కూలు నుంచి ఇంటికి, ఇంటి నుంచి స్కూలుకు తీసుకువెళ్ళే సమయంలో అంత ఎత్తు నుంచి మెట్ల మార్గంలో దిగడం ఇబ్బందిగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే, నీటి సమస్య కరెంటు సమస్యతో తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నామని ఇంకో కుటుంబం చెప్పింది. పోలీస్ స్టేషన్లో కూడా ఓనర్ వేధింపులపై ఫిర్యాదు చేశారు అద్దెకు ఉంటోన్నవారు. చట్ట ప్రకారం ఓనర్ చర్యలు సమర్థనీయం కాదని వారంటున్నారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







