చైనా యాప్స్పై నిషేధం..!..అబ్బే అదేం లేదంటున్న కేంద్రం
- June 22, 2020
భారత్-చైనా బోర్డర్లో ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణ.. 20 మంది భారత సైనికులు వీరమరణం పొందడంతో భారత్ రగిలిపోతోంది.. ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమం చేస్తున్నారు.. చైనా ఉత్పత్తులను బహిష్కరిద్దాం.. ఆ దేశపు యాప్స్ను డెలిట్ చేయాలంటూ సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. ఇదే సమయంలో.. చైనా యాప్స్పై భారత ప్రభుత్వం నిషేధం విధించిందనే వార్తలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఓ నకిలీ వార్తపై ఇండియన్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పందించింది. చైనాకు చెందిన కొన్ని మొబైల్ యాప్స్ను భారత్లో నిషేధిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. వాటి పనితీరును పరిమితం చేయాలని టెక్ కంపెనీలకు ప్రభుత్వం సూచిస్తున్నట్లు ఉన్న ఉత్తర్వులు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విస్తృతమవుతోంది. టిక్టాక్, హలో సహా పలు యాప్లను నిషేధిస్తున్నట్లు ఆ పోస్టులో ఉంది. అయితే, ఆ పోస్టులో ఉన్న ఉత్తర్వులు నకిలీ అని పీఐబీ ట్వీట్ చేసింది. ప్రభుత్వం ఇప్పటివరకు అలాంటి ఉత్తర్వులు విడుదల చేయలేదని క్లారిటీ ఇచ్చింది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







