చైనా యాప్స్పై నిషేధం..!..అబ్బే అదేం లేదంటున్న కేంద్రం
- June 22, 2020
భారత్-చైనా బోర్డర్లో ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణ.. 20 మంది భారత సైనికులు వీరమరణం పొందడంతో భారత్ రగిలిపోతోంది.. ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమం చేస్తున్నారు.. చైనా ఉత్పత్తులను బహిష్కరిద్దాం.. ఆ దేశపు యాప్స్ను డెలిట్ చేయాలంటూ సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. ఇదే సమయంలో.. చైనా యాప్స్పై భారత ప్రభుత్వం నిషేధం విధించిందనే వార్తలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఓ నకిలీ వార్తపై ఇండియన్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పందించింది. చైనాకు చెందిన కొన్ని మొబైల్ యాప్స్ను భారత్లో నిషేధిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. వాటి పనితీరును పరిమితం చేయాలని టెక్ కంపెనీలకు ప్రభుత్వం సూచిస్తున్నట్లు ఉన్న ఉత్తర్వులు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విస్తృతమవుతోంది. టిక్టాక్, హలో సహా పలు యాప్లను నిషేధిస్తున్నట్లు ఆ పోస్టులో ఉంది. అయితే, ఆ పోస్టులో ఉన్న ఉత్తర్వులు నకిలీ అని పీఐబీ ట్వీట్ చేసింది. ప్రభుత్వం ఇప్పటివరకు అలాంటి ఉత్తర్వులు విడుదల చేయలేదని క్లారిటీ ఇచ్చింది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







