దుబాయ్ వచ్చే పర్యాటకులను తీసుకొచ్చేందుకు సంసిద్ధమైన ఎమిరేట్స్, ఫ్లై దుబాయ్
- June 23, 2020
దుబాయ్ : లాక్ డౌన్ తర్వాత మెల్లిమెల్లిగా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటుండటంతో ఇక దుబాయ్ విమానయాన సంస్థలు పర్యాటకులను రిసీవ్ చేసుకునేందుకు సిద్ధమవుతున్నాయి. దుబాయ్ వచ్చే ప్రయాణికులకు జులై 7 నుంచి సేవలను అందించనున్నాయి. ఈ మేరకు దుబాయ్ విమానయాన సంస్థలైన ఫ్లై దుబాయ్, ఎమిరేట్స్ ఎయిర్ వేస్ ప్రయాణికుల భద్రత కోసం తగిన ప్రొటోకాల్ ను సిద్ధం చేసుకుంది. ప్రయాణికులతో పాటు క్యాబిన్ సిబ్బంది, గ్రౌండ్ సిబ్బంది రక్షణకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. వాయుమార్గంలో, ల్యాండింగ్ తర్వాత, నగరంలో ఇలా వివిధ దశల్లో తాము తీసుకుంటున్న చర్యలు వైరస్ ఇన్ఫెక్షన్ల నుంచి ప్రయాణికులకు భద్రత కల్పించేలా ఉంటుందని దుబాయ్ పౌర విమానయాన అధ్యక్షుడు షేక్ అహ్మద్ బిన్ సయిద్ అల్ మక్తూమ్ తెలిపారు. ప్రస్తుతం మారుతున్న పరిస్థితుల కారణంగా పలు దేశాలు అంతర్జాతీయ విమాన సర్వీసులకు అనుమతి ఇస్తున్నాయని..దీంతో క్రమంగా తమ సర్వీసులను పెంచుతున్నామని ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ తెలిపింది. ప్రస్తుతం మరో విమాన సర్వీసులను పెంచుతున్నామని...దీంతో తమ సంస్థకు చెందిన 40 విమానాలు వివిధ నగరాలకు ప్రయాణికులకు చేరవేస్తున్నాయని వివరించింది.
తాజా వార్తలు
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి







