దుబాయ్ వచ్చే పర్యాటకులను తీసుకొచ్చేందుకు సంసిద్ధమైన ఎమిరేట్స్, ఫ్లై దుబాయ్
- June 23, 2020
దుబాయ్ : లాక్ డౌన్ తర్వాత మెల్లిమెల్లిగా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటుండటంతో ఇక దుబాయ్ విమానయాన సంస్థలు పర్యాటకులను రిసీవ్ చేసుకునేందుకు సిద్ధమవుతున్నాయి. దుబాయ్ వచ్చే ప్రయాణికులకు జులై 7 నుంచి సేవలను అందించనున్నాయి. ఈ మేరకు దుబాయ్ విమానయాన సంస్థలైన ఫ్లై దుబాయ్, ఎమిరేట్స్ ఎయిర్ వేస్ ప్రయాణికుల భద్రత కోసం తగిన ప్రొటోకాల్ ను సిద్ధం చేసుకుంది. ప్రయాణికులతో పాటు క్యాబిన్ సిబ్బంది, గ్రౌండ్ సిబ్బంది రక్షణకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. వాయుమార్గంలో, ల్యాండింగ్ తర్వాత, నగరంలో ఇలా వివిధ దశల్లో తాము తీసుకుంటున్న చర్యలు వైరస్ ఇన్ఫెక్షన్ల నుంచి ప్రయాణికులకు భద్రత కల్పించేలా ఉంటుందని దుబాయ్ పౌర విమానయాన అధ్యక్షుడు షేక్ అహ్మద్ బిన్ సయిద్ అల్ మక్తూమ్ తెలిపారు. ప్రస్తుతం మారుతున్న పరిస్థితుల కారణంగా పలు దేశాలు అంతర్జాతీయ విమాన సర్వీసులకు అనుమతి ఇస్తున్నాయని..దీంతో క్రమంగా తమ సర్వీసులను పెంచుతున్నామని ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ తెలిపింది. ప్రస్తుతం మరో విమాన సర్వీసులను పెంచుతున్నామని...దీంతో తమ సంస్థకు చెందిన 40 విమానాలు వివిధ నగరాలకు ప్రయాణికులకు చేరవేస్తున్నాయని వివరించింది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?