హజ్ కు పరిమిత సంఖ్యలో భక్తులకు అనుమతి
- June 23, 2020
సౌదీ: ఈ ఏడాది హజ్ కు పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించనున్నట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. అది కూడా ఇప్పటికే కింగ్ డమ్ పరిధిలో ఉన్నవారికి మాత్రమే అనుమతి ఉంటుందని కూడా తెలిపింది. కరోనా మహమ్మారి కట్టడిలో భాగంగా హజ్ నిర్వహణపై పరిమితులు విధించినట్లు కూడా వెల్లడించింది. పరిమిత సంఖ్యలోనే హజ్ నిర్వహణకు అనుమతి ఇవ్వటం, అది కూడా సౌదీయేతర ముస్లిం దేశాల భక్తులను అనుమతించకపోవటం సౌదీ అరేబియా చరిత్రలోనే ఇదే తొలిసారి. గతేడాది 2.5 మిలియన్ల భక్తులకు హజ్ కు హజరయ్యారు. ఇదిలాఉంటే గల్ఫ్ దేశాల్లోనే అత్యధికంగా సౌదీ అరేబియాలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం 1,61,000 కరోనా కేసులు నమోదయ్యాయి. 1,300 మరణాలు సంభవించాయి. అయితే..ప్రతి ముస్లిం జీవితంలో ఒక్కసారైనా హజ్ యాత్రకు వెళ్లిరావాలని కోరుకుంటాడు. ఇందుకోసం డబ్బు పొదుపు చేసి మరీ వెళ్తారు. కానీ, సౌదీ ప్రభుత్వం తీసుకున్న సున్నిత నిర్ణయం.. భక్తులను నిరాశకు గురిచేసేలా ఉంది.
హజ్ లో పాల్గొనట్లేదని యూఏఈ ప్రకటన
ముస్లిం తీర్థయాత్రను ఇప్పటికే రాజ్యంలో నివసించే యాత్రికులకు పరిమితం చేయాలని సౌదీ అరేబియా నిర్ణయించిన నేపథ్యంలో ఈ ఏడాది హజ్లో పాల్గొనబోమని యూఏఈ హజ్ వ్యవహారాల కార్యాలయం (హెచ్ఓఓ) సోమవారం ప్రకటించింది. సౌదీ హజ్ మరియు ఉమ్రా మంత్రిత్వ శాఖతో సంప్రదించిన తదుపరి HAO ఈ ప్రకటన చేసింది. కరోనా ను అరికట్టేందుకు సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దులాజీజ్ అల్ సౌద్ చేస్తున్న ప్రయత్నాలను యూఏఈ ప్రశంసించింది.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







