దుబాయ్‌లో భారతీయ దంపతులను హత్య చేసిన పాకిస్తానీ

- June 23, 2020 , by Maagulf
దుబాయ్‌లో భారతీయ దంపతులను హత్య చేసిన పాకిస్తానీ

దుబాయ్:పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తి చేతిలో భారతీయ దంపతులు హత్యకు గురైనట్లు  దుబాయ్ ఇండియన్ కాన్సుల్ జనరల్ విపుల్ ధృవీకరించారు.విపుల్ మాట్లాడుతూ ఇది దోపిడీ కేసు, కొన్ని ఆభరణాలు దొంగిలించబడ్డాయి ఆభరణాలన్నీ స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.వివరాల్లోకి వెళ్తే... భారత్‌కు చెందిన హిరెన్ అధియా, భార్య విధి అధియాతో కలిసి రెండు సంవత్సరాల క్రితం దుబాయ్‌కు వెళ్లి అరేబియన్‌ రాంచెస్‌లో నివసిస్తున్నాడు. షార్జాలో వ్యాపారం నిర్వహిస్తున్న హిరెన్ అధియా‌ వ్యాపార నిమిత్తం జూన్‌ 18న యూఏఈకి వచ్చాడు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తి హిరెన్ అధియా‌, అతని భార్య విధి అధియా నుంచి డబ్బు, నగలు దోచుకొని హత్య చేసి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు హత్య చేసిన నిందితుడిని అరెస్ట్ చేశారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com