షార్జా: 25 వ అంతస్తు నుండి కిందపడి మరణించిన భారతీయ వ్యాపారవేత్త
- June 23, 2020
షార్జా: 25వ అంతస్థు నుండి కిందపడి ప్రాణాలు కోల్పోయిన భారత వ్యాపారి..వివరాల్లోకి వెళ్ళితే..దుబాయ్లో నివిసిస్తున్న టి.పి. అజిత్(55) జమాల్ అబ్దుల్ నాజర్ వీధిలోని టవర్ 25 వ అంతస్తు నుండి కిందపడి మరణించారు. ఇది ఆత్మహత్య లేక హత్య అనేది దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
దుబాయ్ లో నివాసముంటున్న అతను షార్జాకు ఎందుకు ప్రయాణించాడో స్పష్టంగా తెలియదని కమ్యూనిటీ వర్గాలు తెలిపాయి. మృతుడు దుబాయ్ నివాసి కావడంతో ఈ కేసును దర్యాప్తు చేయడానికి షార్జా మరియు దుబాయ్ పోలీసులు కలిసి పనిచేయవలసి ఉంటుందని అధికారి తెలిపారు.
30 సంవత్సరాలపాటు యూఏఈ లో నివసిస్తున్న అజిత్ కు గోడౌన్, లాజిస్టిక్స్, కోల్డ్ స్టోరేజ్ వంటి పలు వ్యాపారాలు ఉన్నాయి. అతనికి ఇతర గల్ఫ్ దేశాలలో వ్యాపార ఉనికి ఉంది. ఆయన ఇటీవల కేరళలోని కన్నూర్లో ఒక ఇల్లు నిర్మించారు. ఆయనకు భార్య బిందు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమారుడు వ్యాపారం నడుపుటకు అజిత్ కు సహాయం అందిస్తుండగా కుమార్తె విద్యనభ్యసిస్తున్నట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







