షార్జా: 25 వ అంతస్తు నుండి కిందపడి మరణించిన భారతీయ వ్యాపారవేత్త
- June 23, 2020
షార్జా: 25వ అంతస్థు నుండి కిందపడి ప్రాణాలు కోల్పోయిన భారత వ్యాపారి..వివరాల్లోకి వెళ్ళితే..దుబాయ్లో నివిసిస్తున్న టి.పి. అజిత్(55) జమాల్ అబ్దుల్ నాజర్ వీధిలోని టవర్ 25 వ అంతస్తు నుండి కిందపడి మరణించారు. ఇది ఆత్మహత్య లేక హత్య అనేది దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
దుబాయ్ లో నివాసముంటున్న అతను షార్జాకు ఎందుకు ప్రయాణించాడో స్పష్టంగా తెలియదని కమ్యూనిటీ వర్గాలు తెలిపాయి. మృతుడు దుబాయ్ నివాసి కావడంతో ఈ కేసును దర్యాప్తు చేయడానికి షార్జా మరియు దుబాయ్ పోలీసులు కలిసి పనిచేయవలసి ఉంటుందని అధికారి తెలిపారు.
30 సంవత్సరాలపాటు యూఏఈ లో నివసిస్తున్న అజిత్ కు గోడౌన్, లాజిస్టిక్స్, కోల్డ్ స్టోరేజ్ వంటి పలు వ్యాపారాలు ఉన్నాయి. అతనికి ఇతర గల్ఫ్ దేశాలలో వ్యాపార ఉనికి ఉంది. ఆయన ఇటీవల కేరళలోని కన్నూర్లో ఒక ఇల్లు నిర్మించారు. ఆయనకు భార్య బిందు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమారుడు వ్యాపారం నడుపుటకు అజిత్ కు సహాయం అందిస్తుండగా కుమార్తె విద్యనభ్యసిస్తున్నట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







