కువైట్ : కరోనాతో మరణించిన సెంట్రల్ జైలు ఖైదీ
- June 23, 2020
కువైట్ లోని సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న మహిళా ఖైదీ కరోనాతో చనిపోయినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖలోని భద్రత పరిపాలన విభాగం అధికారులు వెల్లడించారు. 59 ఏళ్ల మహిళా ఖైదీకి కరోనా ఉన్నట్లు నిర్ధారణ కావటంతో...ఈ నెల 15న ఆమెను ఆస్పత్రిలో చేర్పించామన్నారు. అల్ ఫర్వానియా ఆస్పత్రిలో వారం పాటు చికిత్స అందించిన తర్వాత ఆమె శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు ఎదుర్కొని మరణించినట్లు వెల్లడించారు. అయితే..ఆమెకు ఇతర రోగాలు కూడా ఉండటంతో కరోనా నుంచి కోలుకోలేకపోయినట్లు చెబుతున్నారు. మహిళా ఖైదీ కరోనా బారిన పడటంతో జైలులో తగిన జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని, ఇతర ఖైదీలకు వైరస్ వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు చేపట్టామని వెల్లడించారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







