దుబాయ్:నిషేధిత డ్రగ్స్ ను ప్రమోట్ చేస్తున్న 10 సోషల్ మీడియా అకౌంట్ల గుర్తింపు
- June 23, 2020
దుబాయ్:నిషేధిత డ్రగ్స్ అమ్మకాలపై దుబాయ్ పోలీస్ ఉక్కుపాదం మోపుతోంది. సోషల్ మీడియా వేదికగా డ్రగ్స్ ను అమ్ముతున్న 10 ఖాతాలను దుబాయ్ పోలీసులు గుర్తించారు. ప్రజాదరణ పొందిన ప్రముఖ సామాజిక మాద్యమాలు ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, స్నాప్ చాట్ ను వేదికగా చేసుకొని డ్రగ్స్ ప్రమోట్ చేస్తున్నట్లు తాము నిర్ధారించుకున్నామని దుబాయ్ పోలీసులు వెల్లడించారు. ఇన్ స్టాగ్రామ్ వేదికగా డ్రగ్స్ అమ్ముతున్న వ్యక్తి ఖాతాలో 16 వందల మంది ఫాలోవర్లు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. డ్రగ్స్ అమ్మకాలకు సంబంధించి వీడియోలను కూడా పోస్ట్ చేసినట్లు చెప్పారు. అయితే..తమ చేతికి చిక్కకుండా అతను చాలా జాగ్రత్తగా వ్యవహరించినప్పటికీ..వలపన్ని అతన్ని పట్టుకున్నామని పోలీసులు వివరించారు. అలాగే ఆసియా దేశాలకు చెందిన మరో వ్యక్తి స్నాప్ చాట్ వేదికగా డ్రగ్స్ అమ్ముతున్నాడన్నారు. ఆన్ లైన్ లో డబ్బులు పంపిస్తే..డ్రగ్స్ సరఫరా చేస్తామని కస్టమర్లకు చెబుతున్నాడని, అయితే..తాము అకౌంట్ ట్రేస్ చేసి వివరాలు రాబట్టిన తర్వాత అతను విదేశాల్లో ఉంటున్నట్లు గుర్తించామన్నారు. ఏదిఏమైనా డ్రగ్స్ కు సంబంధించిన కేసుల్లో తాము ఎక్కువగా ఫోకస్ చేస్తామని, కఠిన చర్యలు తీసుకుంటామని దుబాయ్ పోలీసులు హెచ్చరించారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ప్రవర్తనపై ఓ కన్నేసి ఉంచాలని సూచించారు.సోషల్ మీడియా అకౌంట్ల పై గట్టి నిఘా ఉందని దుబాయ్ పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ అబ్దుల్లా ఖలీఫా అల్ మర్రి తెలిపారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







