బహ్రెయిన్:కరోనా నేపథ్యంలో ఆన్ లైన్ లోనే స్కూల్ పరీక్షా ఫలితాలు
- June 24, 2020
మనామా:కరోనా నేపథ్యంలో ఈ ఏడాది పరీక్షా ఫలితాలను పేపర్ లెస్ గా విడుదల చేయాలని నిర్ణయించింది విద్యాశాఖ. దీంతో ఈ ఏడాది స్కూల్ పరీక్షా ఫలితాలు అన్ని ఆన్ లైన్ లోనే విడుదల కానున్నాయి. ఒక్కసారి అధికారక ధృవీకరణ తర్వాత ఫలితాలను డిజిటల్ వేదికగా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. పేపర్లు, సర్టిఫికెట్ల ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు మెండుగా ఉండటం, అంతేకాకుండా భైతిక దూరం అమలుకు కూడా విఘాతం కలిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖకు సంబంధించిన పోర్టల్ edunet.bh లో విద్యార్ధుల పరీక్ష ఫలితాలను చెక్ చేసుకోవచ్చునని వెల్లడించారు. థార్డ్ ఇంటర్మిడియెట్, సెకండరీ స్కూల్ స్టూడెంట్స్ కూడా microsoft365 అకౌంట్స్ ద్వారా సర్టిఫికెట్లను పొందవచ్చని విద్యాశాఖ అధికారులు తెలిపారు. అలాగే గ్రాడ్యూయేషన్, గుడ్ కండక్ట్ సర్టిఫికెట్ కూడా ఈ మెయిల్ ద్వారా అందించనున్నట్లు ప్రకటించారు. ఎవరైనా విద్యార్ధులు సాంకేతిక కారణాలతో సర్టిఫికెట్లను, పరీక్ష ఫలితానలు పొందలేకపోతే..17-278777కు ఆఫీసు సమయాల్లో ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. అలాగే microsoft365 సంబంధించి ఎవైనా సమస్యలు ఉంటే..yalla365.net/yalla-formకు లేదంటే [email protected] ద్వారా నివృత్తి చేసుకోవచ్చని కూడా విద్యాశాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







