కోవిడ్ 19: యూఏఈలో స్టెరిలైజేషన్ పూర్తి..జనసంచారంపై నిషేధం ఎత్తివేత
- June 25, 2020
యూఏఈ:కరోనా వైరస్ కట్టడి కోసం యూఏఈ చేపట్టిన జాతీయ స్టెరిలైజేషన్ (క్రిమిసంహారక చర్య) డ్రైవ్ బుధవారంతో ముగిసింది. దీంతో జనసంచారంపై నిషేధాన్ని ఎత్తివేసింది ప్రభుత్వం. ఇక నుంచి ప్రజలు బయట తిరగొచ్చని, అయితే...కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం సూచించిన నిబంధనలు మాత్రం ఖచ్చితంగా పాటించాలని ప్రకటించింది. అంతేకాదు..12 ఏళ్లలోపు పిల్లలు షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లకు వెళ్లొద్దనే ఆంక్షలను కూడా సడలించింది. ఇంటి నుంచి బయటికి వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా భౌతిక దూరం పాటించటంతో పాటు..ఫేస్ మాస్క్, హ్యాండ్ గ్లౌజులు వేసుకోవాలని తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానా విధిస్తామని హెచ్చరించింది ప్రభుత్వం. వీలైనంత వరకు విహార యాత్రలు, ఇతర పర్యటనలకు వెళ్లకుండా ఉండటమే మంచిదని..తప్పనిసరైతేనే ప్రయాణాలు చేయాలని సూచించింది. కార్లలో ప్రయాణించే వారు ముగ్గురికి మించి ఉండకూడదని కూడా వెల్లడించింది. ఇదిలాఉంటే..నేషనల్ స్టెరిలైజేషన్ ప్రక్రియ పూర్తి కావటంతో దుబాయ్ లో కూడా జనసంచారంపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు కరోనా కట్టడి కోసం ఏర్పాటు చేసిన సుప్రీం కమిటీ ప్రకటించింది. కమిటి సూచించిన ముందస్తు జాగ్రత్త చర్యలు పాటిస్తూ ప్రజలు ఏ సమయంలోనైనా స్వేచ్ఛగా బయట తిరగొచ్చని వెల్లడించింది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







