కువైట్:విదేశీ కార్మికులకు షాక్..ఆయిల్ సెక్టార్ లో 500 మంది నిలిపివేత
- June 25, 2020
కువైట్ సిటీ:కరోనా సంక్షోభం భయపెడుతున్న వేళ కువైట్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశ యువతకు ఉపాధి అవకాశాలను పెంచేందుకు అవసరమైన చర్యలు చేపడుతోంది. ఇందుకోసం విదేశీ కార్మికులను పనులను నుంచి పక్కకు తప్పిస్తోంది. కువైట్ అయిల్ రంగంలో దాదాపు 500 మంది కార్మికులను పనిని పక్కకు తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. దేశంలో విదేశీయులకు ఉపాధిని నియంత్రిస్తూ ఆయా రంగాల్లో దేశ పౌరులకు అవకాశం కల్పించటంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు..దేశ పౌరుల కంటే విదేశాల నుంచి ఉపాధి పొందుతున్న వారి సంఖ్య గరిష్టంగా ఉంటోందన్నది కువైట్ వాదన. దేశంలో ఉపాధి విషయంలో సమతుల్యత పాటించేందుకు విదేశీయులకు నిర్ణీత కోటా విధానాన్ని అవలంభించాలని చట్టసభ్యులు ఇప్పటికే ఓ ముసాయిదా తీర్మానాన్ని సమర్పించిన విషయం తెలిసిందే. విదేశాల నుంచి వచ్చి ఉపాధి పొందుతున్న వారిలో చాలా మంది నైపుణ్యం లేని వారే ఉంటున్నారని, అలాగే ప్రస్తుత కరోనా సంక్షోభంలో వారు దేశీయ ఆరోగ్య వసతులపై కూడా ప్రభావం చూపిస్తున్నారన్నది కువైట్ ఆరోపణ. ఈ నేపథ్యంలోనే కువైట్ ఆయిల్ రంగంలోని దాదాపు 500 మంది కార్మికుల కాంట్రాక్ట్ ను నిలిపివేసింది. ప్రస్తుతం నిలిపివేసిన 500 మందితో గతేడాదే కాంట్రాక్ట్ కుదుర్చుకున్నా..అది కరోనా సంక్షోభానికి ముందు తీసుకున్న నిర్ణమని చమురు శాఖ మంత్రి వెల్లడించారు. అంతేకాక..కేంద్ర అడ్జుకేషన్ కమిటి ఇంకా ఈ కాంట్రాక్ట్ ను ఆమోదించలేదనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







