కువైట్:విదేశీ కార్మికులకు షాక్..ఆయిల్ సెక్టార్ లో 500 మంది నిలిపివేత
- June 25, 2020
కువైట్ సిటీ:కరోనా సంక్షోభం భయపెడుతున్న వేళ కువైట్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశ యువతకు ఉపాధి అవకాశాలను పెంచేందుకు అవసరమైన చర్యలు చేపడుతోంది. ఇందుకోసం విదేశీ కార్మికులను పనులను నుంచి పక్కకు తప్పిస్తోంది. కువైట్ అయిల్ రంగంలో దాదాపు 500 మంది కార్మికులను పనిని పక్కకు తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. దేశంలో విదేశీయులకు ఉపాధిని నియంత్రిస్తూ ఆయా రంగాల్లో దేశ పౌరులకు అవకాశం కల్పించటంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు..దేశ పౌరుల కంటే విదేశాల నుంచి ఉపాధి పొందుతున్న వారి సంఖ్య గరిష్టంగా ఉంటోందన్నది కువైట్ వాదన. దేశంలో ఉపాధి విషయంలో సమతుల్యత పాటించేందుకు విదేశీయులకు నిర్ణీత కోటా విధానాన్ని అవలంభించాలని చట్టసభ్యులు ఇప్పటికే ఓ ముసాయిదా తీర్మానాన్ని సమర్పించిన విషయం తెలిసిందే. విదేశాల నుంచి వచ్చి ఉపాధి పొందుతున్న వారిలో చాలా మంది నైపుణ్యం లేని వారే ఉంటున్నారని, అలాగే ప్రస్తుత కరోనా సంక్షోభంలో వారు దేశీయ ఆరోగ్య వసతులపై కూడా ప్రభావం చూపిస్తున్నారన్నది కువైట్ ఆరోపణ. ఈ నేపథ్యంలోనే కువైట్ ఆయిల్ రంగంలోని దాదాపు 500 మంది కార్మికుల కాంట్రాక్ట్ ను నిలిపివేసింది. ప్రస్తుతం నిలిపివేసిన 500 మందితో గతేడాదే కాంట్రాక్ట్ కుదుర్చుకున్నా..అది కరోనా సంక్షోభానికి ముందు తీసుకున్న నిర్ణమని చమురు శాఖ మంత్రి వెల్లడించారు. అంతేకాక..కేంద్ర అడ్జుకేషన్ కమిటి ఇంకా ఈ కాంట్రాక్ట్ ను ఆమోదించలేదనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







