భారత్లో 24గంటల్లో 16,992కేసులు...
- June 25, 2020
భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. భారత్ లో ఒక్క రోజే 16,992 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రోజురోజుకీ ఈ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గత కొద్ది రోజులుగా పరిశీలిస్తే ఈ కేసులు చాలా ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ప్రభుత్వం సేవలు అందిస్తున్న వారు సైతం ఈ కరోనా వైరస్ భారిన పడుతున్నారు. భారత్ లో తాజాగా నమోదు అయినా పాజిటివ్ కేసులతో మొత్తం కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 4,73,105 కి చేరింది.
గడిచిన 24 గంటల్లో కరోనా వైరస్ కారణం గా భారత్ లో 418 మరణించారు. అయితే ఈ మరణాల్లో వైద్యులు, పోలీసులు కూడా ఉంటున్నారు. ఎక్కువగా కరోనా వైరస్ ను అరికట్టడానికి సేవ చేస్తున్న వారు దీని భారిన పడటం ఎక్కువ వేదన కి గురి చేస్తుంది. అయితే తాజాగా నమోదు అయినా ఈ మరణాలతో భారత్ లో మరణించన వారి సంఖ్య 14,894 కి చేరింది.
భారత్ లో ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకి, కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2,71,697 కి చేరింది. రోజురోజుకీ వీరి సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే భారత్ లో 1,86,514 మంది కరోనా వైరస్ భారిన పడి చికిత్స పొందుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ కరోనా వైరస్ భారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది.
తాజా వార్తలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం







