భారత్లో 24గంటల్లో 16,992కేసులు...
- June 25, 2020
భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. భారత్ లో ఒక్క రోజే 16,992 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రోజురోజుకీ ఈ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గత కొద్ది రోజులుగా పరిశీలిస్తే ఈ కేసులు చాలా ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ప్రభుత్వం సేవలు అందిస్తున్న వారు సైతం ఈ కరోనా వైరస్ భారిన పడుతున్నారు. భారత్ లో తాజాగా నమోదు అయినా పాజిటివ్ కేసులతో మొత్తం కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 4,73,105 కి చేరింది.
గడిచిన 24 గంటల్లో కరోనా వైరస్ కారణం గా భారత్ లో 418 మరణించారు. అయితే ఈ మరణాల్లో వైద్యులు, పోలీసులు కూడా ఉంటున్నారు. ఎక్కువగా కరోనా వైరస్ ను అరికట్టడానికి సేవ చేస్తున్న వారు దీని భారిన పడటం ఎక్కువ వేదన కి గురి చేస్తుంది. అయితే తాజాగా నమోదు అయినా ఈ మరణాలతో భారత్ లో మరణించన వారి సంఖ్య 14,894 కి చేరింది.
భారత్ లో ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకి, కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2,71,697 కి చేరింది. రోజురోజుకీ వీరి సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే భారత్ లో 1,86,514 మంది కరోనా వైరస్ భారిన పడి చికిత్స పొందుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ కరోనా వైరస్ భారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది.
తాజా వార్తలు
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- వాట్సాప్ వాయిస్ మెసేజ్లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!







