మృతిచెందిన ప్రవాసికి ఘనమైన నివాళి.. ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్
- June 27, 2020
యూ.ఏ.ఈ:దుబాయ్లో మెకానికల్ ఇంజనీర్గా పనిచేస్తున్న తిన్ చంద్రన్(28) అనే భారత ప్రవాసి జూన్ 8న గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.
జూన్ 8న దుబాయ్ లో అకాల మరణం చెందిన మలయాళీ వాసి నితిన్ చంద్రన్ జ్ఞాపకార్థం ఒక భారతీయ సంఘం గురువారం షార్జా నుండి కేరళకు చార్డర్డ్ ప్లైట్ ఏర్పాటు చేసింది. మొత్తం 215 మంది ప్రయాణికులను ప్రత్యేక ఎయిర్ అరేబియా విమానంలో గురువారం రాత్రి 11.30 గంటలకు కోజికోడ్ కు పంపించారు.
లాక్డౌన్ సడలింపుల అనంతరం గర్భంతో ఉన్న భార్యను స్వదేశానికి పంపించారు నితిన్ చంద్రన్. అనంతరం దుబాయ్ లోనే ఉన్న నితిన్ చంద్రన్ నిద్రలోనే గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మరణించిన తరువాత రోజే భార్య అతిర గీతా శ్రీధరన్.. చిన్నారికి జన్మనిచ్చింది.
ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాల పట్ల మక్కువ, అంకిత భావంతో పాటు సామాజిక కార్యకర్త కూడా అయిన నితిన్ చంద్రన్ మరణం యూ.ఏ.ఈలోని భారతీయ సమాజం వారిని షాక్ కి గురి చేసింది. ఆయనకు నివాళి అర్పించే దిశగా నితిన్ స్వస్థలమైన కోజిక్కోడుకు విమానం చార్టర్ చేయాలని నిర్ణయించుకున్నాము అని RAK ఇండియన్ అసోసియేషన్ అధ్యక్షుడు SA సలీమ్ అన్నారు. 30 మంది గర్భిణీ స్త్రీలు ఉన్న ఈ ఫ్లైట్ లో ప్రయాణించిన వారికి ఉచితంగా టికెట్లు అందించినట్లు చెప్పారు. నితిన్ చంద్రన్ చిత్రాలతో వారందరికి ప్రత్యేక బోర్డింగ్ పాస్ తో పాటు ఉచితంగా పీపీఈ కిట్లు అందించారు.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







