ప్రపంచవ్యాప్తంగా భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలు
- June 27, 2020
హైదరాబాద్:ప్రపంచవ్యాప్తంగా భారత మాజీ ప్రధాని తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలని నిర్వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.ఈ కార్యక్రమంలో భాగంగా నిన్న మంత్రి కేటీఆర్,ఉత్సవ కమిటీ సభ్యులు టీఆరెస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగల తో కలిసి దాదాపు 51 దేశల్లో నివసిస్తున్న తెలుగు వారితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పీవీ అవలంబించిన వివిధ విప్లవాత్మక సంస్కరణల నిర్ణయాలతో మన దేశాన్ని అభివృద్ధి వైపు నడిపాయి అని గుర్తు చేశారు. అలాగే అన్ని దేశాల లో సంవత్సరం పాటు పీవీ జయంతి ఉత్సవలను నిర్వహించాలని దశ నిర్దేశం చేశారు. అలాగే ఏదైనా దేశాలల్లో అక్కడి ప్రభుత్వం అనుమతి ఇస్తే పీవీ విగ్రహాలు కూడా తెలంగాణ ప్రభుత్వం తరపున ఏర్పాటు చేస్తామని కేటీఆర్ చెప్పారు.ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు గా మహేష్ బిగల ని నియమించినందుకు అన్ని వివిధ దేశాల ప్రతినిధులు అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ,ఎమ్మెల్యే రమేష్ బాబు ,ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మరియు వివిధ దేశాల నుండి దాదాపు ఐదు వందలకు పైగా తెలుగు ఎన్నారైలు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు