ప్రపంచవ్యాప్తంగా భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలు
- June 27, 2020
హైదరాబాద్:ప్రపంచవ్యాప్తంగా భారత మాజీ ప్రధాని తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలని నిర్వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.ఈ కార్యక్రమంలో భాగంగా నిన్న మంత్రి కేటీఆర్,ఉత్సవ కమిటీ సభ్యులు టీఆరెస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగల తో కలిసి దాదాపు 51 దేశల్లో నివసిస్తున్న తెలుగు వారితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పీవీ అవలంబించిన వివిధ విప్లవాత్మక సంస్కరణల నిర్ణయాలతో మన దేశాన్ని అభివృద్ధి వైపు నడిపాయి అని గుర్తు చేశారు. అలాగే అన్ని దేశాల లో సంవత్సరం పాటు పీవీ జయంతి ఉత్సవలను నిర్వహించాలని దశ నిర్దేశం చేశారు. అలాగే ఏదైనా దేశాలల్లో అక్కడి ప్రభుత్వం అనుమతి ఇస్తే పీవీ విగ్రహాలు కూడా తెలంగాణ ప్రభుత్వం తరపున ఏర్పాటు చేస్తామని కేటీఆర్ చెప్పారు.ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు గా మహేష్ బిగల ని నియమించినందుకు అన్ని వివిధ దేశాల ప్రతినిధులు అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ,ఎమ్మెల్యే రమేష్ బాబు ,ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మరియు వివిధ దేశాల నుండి దాదాపు ఐదు వందలకు పైగా తెలుగు ఎన్నారైలు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







