ప్రపంచవ్యాప్తంగా భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలు
- June 27, 2020
హైదరాబాద్:ప్రపంచవ్యాప్తంగా భారత మాజీ ప్రధాని తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలని నిర్వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.ఈ కార్యక్రమంలో భాగంగా నిన్న మంత్రి కేటీఆర్,ఉత్సవ కమిటీ సభ్యులు టీఆరెస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగల తో కలిసి దాదాపు 51 దేశల్లో నివసిస్తున్న తెలుగు వారితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పీవీ అవలంబించిన వివిధ విప్లవాత్మక సంస్కరణల నిర్ణయాలతో మన దేశాన్ని అభివృద్ధి వైపు నడిపాయి అని గుర్తు చేశారు. అలాగే అన్ని దేశాల లో సంవత్సరం పాటు పీవీ జయంతి ఉత్సవలను నిర్వహించాలని దశ నిర్దేశం చేశారు. అలాగే ఏదైనా దేశాలల్లో అక్కడి ప్రభుత్వం అనుమతి ఇస్తే పీవీ విగ్రహాలు కూడా తెలంగాణ ప్రభుత్వం తరపున ఏర్పాటు చేస్తామని కేటీఆర్ చెప్పారు.ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు గా మహేష్ బిగల ని నియమించినందుకు అన్ని వివిధ దేశాల ప్రతినిధులు అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ,ఎమ్మెల్యే రమేష్ బాబు ,ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మరియు వివిధ దేశాల నుండి దాదాపు ఐదు వందలకు పైగా తెలుగు ఎన్నారైలు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







