షార్జా:కనీస వసతులు లేకుండా కష్టాల్లో భారత కార్మికులు..ఆదుకున్న ఇండియన్ అసోసియేషన్
- June 28, 2020షార్జా:కరోనా నేపథ్యంలో కనీస వసతులు కూడా లెకుండా కష్టాలు పడుతున్న భారత కార్మికులను షార్జా పోలీసులు, కార్మిక శాఖ, ఇండియన్ అసోసియేషన్ షార్జా ప్రతినిధులు ఆదుకున్నారు. ఓ భవన నిర్మాణ ప్రాంతంలో చిక్కుకుపోయిన దాదాపు 300 మంది కార్మికులను అక్కడి నుంచి తరలించారు. కార్మికులు పని చేసే చోట కనీసం ఆహారం కూడా సరిగ్గా అందలేదు. అంతేకాదు..మండే ఎండలో వారికి ఏసీ ఏర్పాటు చేయలేదు. టాయిలెట్స్ సౌకర్యం కూడా లేదు. కరోనా వ్యాపిస్తున్న సమయంలో అంతటి దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటూ కష్టాలు పడుతున్న కార్మికుల గురించి తెలుసుకున్న టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ ఎస్వీ రెడ్డి, ఏపీ కాంగ్రెస్ సదత్ సౌదాగర్ చొరవ తీసుకున్నారు. వీరితో పాటు..ఇండియన్ అసోసియేషన్ షార్జా అధ్యక్షుడు ఈ.పీ. జాన్సన్, యాక్టీవ్ ట్రెజరర్ షాజీ జాన్, ఐఏఎస్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యుడు అహ్మద్ షిబ్లి సాయంతో నిర్మాణ ప్రదేశంలో చిక్కుకుపోయిన 300 మంది కార్మికులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. షార్జా ఇండియన్ స్కూల్, షార్జా పోలీసులు భారత కార్మికులను తరలించేందుకు 13 బస్సులను ఏర్పాటు చేసింది.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!