పచ్చిమిర్చి చేపల వేపుడు

- February 02, 2016 , by Maagulf
పచ్చిమిర్చి చేపల వేపుడు

కావలసినవి: 300 గ్రాముల చేప, ఒక నిమ్మకాయ,20గ్రాముల అల్లం పేస్టు.20గ్రాముల వెల్లుల్లి పేస్టు, రెండు గ్రాముల వాము, ఐదు పచ్చిమిరపకాయలు,50గ్రాముల ధనియాలు, ఐదు గ్రాముల దానిమ్మ గింజల పొడి, రెండు గ్రాముల నల్ల ఉప్పు, 50 గ్రాముల నీళ్లు వడకట్టిన గట్టిపెరుగు, ఒక టేబుల్‌ స్పూన్‌ నూనె, రెండు గ్రాముల జీలకర్ర, ఉప్పు రుచికి తగినంత.

తయారుచేసే విధానం
చేపముక్కలను శుభ్రంగా కడిగి నీటిని వడకట్టి అల్లం వెల్లుల్లి పేస్టు,నిమ్మకాయ రసం కలిపి కొంచెంసేపు నానపెట్టుకోవాలి. నూరి ఉంచుకున్న పచ్చిమిరపకాయల ముద్ద,ధనియాల పొడి,దానిమ్మపొడి,వాముని కూడా చేపముక్కలకి పట్టించాలి. చేప ముక్కలని అలాగే రెండుగంటలు నాననివ్వాలి.
ఇక ఇప్పుడు పాన్‌లో నూనె వేసి కాగిన తరువాత చేప ముక్కలను ఒక్కొక్కటిగా వేయించుకోవాలి. ఇలా చేసిన చేప వేపుడు చూడటానికి పచ్చగా కంటికింపుగా ఉండటమే కాక కొత్తరుచిని మీకందిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com