పచ్చిమిర్చి చేపల వేపుడు
- February 02, 2016
కావలసినవి: 300 గ్రాముల చేప, ఒక నిమ్మకాయ,20గ్రాముల అల్లం పేస్టు.20గ్రాముల వెల్లుల్లి పేస్టు, రెండు గ్రాముల వాము, ఐదు పచ్చిమిరపకాయలు,50గ్రాముల ధనియాలు, ఐదు గ్రాముల దానిమ్మ గింజల పొడి, రెండు గ్రాముల నల్ల ఉప్పు, 50 గ్రాముల నీళ్లు వడకట్టిన గట్టిపెరుగు, ఒక టేబుల్ స్పూన్ నూనె, రెండు గ్రాముల జీలకర్ర, ఉప్పు రుచికి తగినంత.
తయారుచేసే విధానం
చేపముక్కలను శుభ్రంగా కడిగి నీటిని వడకట్టి అల్లం వెల్లుల్లి పేస్టు,నిమ్మకాయ రసం కలిపి కొంచెంసేపు నానపెట్టుకోవాలి. నూరి ఉంచుకున్న పచ్చిమిరపకాయల ముద్ద,ధనియాల పొడి,దానిమ్మపొడి,వాముని కూడా చేపముక్కలకి పట్టించాలి. చేప ముక్కలని అలాగే రెండుగంటలు నాననివ్వాలి.
ఇక ఇప్పుడు పాన్లో నూనె వేసి కాగిన తరువాత చేప ముక్కలను ఒక్కొక్కటిగా వేయించుకోవాలి. ఇలా చేసిన చేప వేపుడు చూడటానికి పచ్చగా కంటికింపుగా ఉండటమే కాక కొత్తరుచిని మీకందిస్తుంది.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







