పాకిస్థాన్ లో రెండు లక్షలు దాటిన కరోనా కేసులు
- June 28, 2020
పాకిస్థాన్ లో కరోనా వైరస్ విశ్వరూపం ప్రదర్శిస్తోంది. ఆదివారం 4,072 కొత్త కేసులు నమోదయ్యాయి,దాంతో పాజిటివ్ కేసుల సంఖ్య 202,955 కు పెరిగింది. వ్యాధి సోకిన వారిలో 92,000 మందికి పైగా అంటే 45 శాతం మందికి కోలుకోగా, 2,805 మందికి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఇప్పటివరకూ మొత్తం 4,118 మరణాలు సంభవించాయి. గత 20 రోజులలో 100,000 కంటే ఎక్కువ కొత్త కేసులు నమోదయ్యాయి, అయితే జూన్ 30 నాటికి ఈ సంఖ్య 225,000 వరకు ఉండవచ్చని ప్రభుత్వ అంచనాలు సూచిస్తున్నాయి.
మరోవైపు ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మొదటి నుండి వైరస్ పై పోరాడటానికి ఎక్కువకాలం లాక్డౌన్ పెట్టడాన్ని వ్యతిరేకించారు, దేశ ఆర్థిక వ్యవస్థ దానిని భరించలేదని వాదించారు. దీంతో లాక్ డౌన్ లేకపోవడంతో ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో విచ్చలవిడిగా తిరుగుతున్నారు. దాంతో వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇదిలావుంటే పాకిస్థాన్ లో జూన్ 14 నుండి 20 ప్రధాన నగరాల్లో వైరస్ హాట్స్పాట్లను గుర్తించారు. ఇక్కడే లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాలనీ ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







