పాకిస్థాన్ లో రెండు లక్షలు దాటిన కరోనా కేసులు
- June 28, 2020
పాకిస్థాన్ లో కరోనా వైరస్ విశ్వరూపం ప్రదర్శిస్తోంది. ఆదివారం 4,072 కొత్త కేసులు నమోదయ్యాయి,దాంతో పాజిటివ్ కేసుల సంఖ్య 202,955 కు పెరిగింది. వ్యాధి సోకిన వారిలో 92,000 మందికి పైగా అంటే 45 శాతం మందికి కోలుకోగా, 2,805 మందికి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఇప్పటివరకూ మొత్తం 4,118 మరణాలు సంభవించాయి. గత 20 రోజులలో 100,000 కంటే ఎక్కువ కొత్త కేసులు నమోదయ్యాయి, అయితే జూన్ 30 నాటికి ఈ సంఖ్య 225,000 వరకు ఉండవచ్చని ప్రభుత్వ అంచనాలు సూచిస్తున్నాయి.
మరోవైపు ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మొదటి నుండి వైరస్ పై పోరాడటానికి ఎక్కువకాలం లాక్డౌన్ పెట్టడాన్ని వ్యతిరేకించారు, దేశ ఆర్థిక వ్యవస్థ దానిని భరించలేదని వాదించారు. దీంతో లాక్ డౌన్ లేకపోవడంతో ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో విచ్చలవిడిగా తిరుగుతున్నారు. దాంతో వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇదిలావుంటే పాకిస్థాన్ లో జూన్ 14 నుండి 20 ప్రధాన నగరాల్లో వైరస్ హాట్స్పాట్లను గుర్తించారు. ఇక్కడే లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాలనీ ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







