ఏపీలో ఒక్కరోజే 11 కరోనా మరణాలు...
- June 29, 2020అమరావతి:ఏపీలోని గడిచిన 24 గంటల్లో 793 కరోనా కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ తెలిపింది. ఈరోజు ఒక్కరోజే.. 11 మంది చనిపోయారు. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 13,891మందికి చేరింది. ఇప్పటివరకూ 6232 మంది డిశ్చార్జ్ అవ్వగా.. 7479 మంది చికిత్స పొందుతున్నారు. తాజాగా నమోదైన కేసుల్లో 708 మంది రాష్ట్రంలో వారు కాగా.. 81 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. అటు, విదేశాల నుంచి వచ్చిన వారికి ఆరుగురికి కరోనా సోకిందని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 180 మంది కరోనాతో మృతి చెందారు.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..