సిమ్ కార్డ్ స్కామ్: 17 మంది వలసదారుల అరెస్ట్
- June 30, 2020రియాద్: సౌదీ పోలీస్, 17 మంది వలసదారుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. నిందితులు ఫోర్జరీ ఐడీ కార్డుల సాయంతో అక్రమంగా సిమ్ కార్డుల్ని రూపొందించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇందుకోసం అల్ అజిజియా ప్రాంతంలో రెండు అపార్ట్మెంట్లను వినియోగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. రియాద్ పోలీస్ అధికార ప్రతినిది¸ కల్నల్ షాకెర్ మాట్లాడుతూ, నిందితుల్లో ఈజిప్టియన్, సిరియన్, యెమెనీ సహా బంగ్లాదేశీ జాతీయులు వున్నట్లు వివరించారు.నిందితుల దగ్గర్నుంచి 9,000 సిమ్ కార్డుల్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వారి నుంచి మూడు ఫింగర్ ప్రింట్ రీడర్లు, కంప్యూటర్లు, స్కానర్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇల్లీగల్ బ్రోకరేజ్ యాక్టివిటీకి పాల్పడుతున్నట్లు నిందితులు విచారణలో అంగీకరించారు. నిందితుల్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్కి అప్పగించడం జరిగింది.
తాజా వార్తలు
- వాట్సాప్లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు
- భారత్-ఒమన్ మధ్య పెరిగిన విమాన ఛార్జీలు..!
- కువైట్ లో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం