సిమ్ కార్డ్ స్కామ్: 17 మంది వలసదారుల అరెస్ట్
- June 30, 2020
రియాద్: సౌదీ పోలీస్, 17 మంది వలసదారుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. నిందితులు ఫోర్జరీ ఐడీ కార్డుల సాయంతో అక్రమంగా సిమ్ కార్డుల్ని రూపొందించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇందుకోసం అల్ అజిజియా ప్రాంతంలో రెండు అపార్ట్మెంట్లను వినియోగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. రియాద్ పోలీస్ అధికార ప్రతినిది¸ కల్నల్ షాకెర్ మాట్లాడుతూ, నిందితుల్లో ఈజిప్టియన్, సిరియన్, యెమెనీ సహా బంగ్లాదేశీ జాతీయులు వున్నట్లు వివరించారు.నిందితుల దగ్గర్నుంచి 9,000 సిమ్ కార్డుల్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వారి నుంచి మూడు ఫింగర్ ప్రింట్ రీడర్లు, కంప్యూటర్లు, స్కానర్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇల్లీగల్ బ్రోకరేజ్ యాక్టివిటీకి పాల్పడుతున్నట్లు నిందితులు విచారణలో అంగీకరించారు. నిందితుల్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్కి అప్పగించడం జరిగింది.
తాజా వార్తలు
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ







