కరోనా ఇప్పట్లో వదలదు:WHO
- June 30, 2020
జెనీవా:కరోనా వైరస్ మన జీవితాల్లోకి వచ్చి ఆరు నెలలు అయింది. ప్రపంచ వ్యాప్తంగా కోటి మందికి పైగా వైరస్ బారిన పడ్డారు. 5 లక్షమంది మహమ్మారి బారిన పడి మరణించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో కొన్ని దేశాలు పురోగతిని సాధించినా.. భయంకరమైన వాస్తవం ఏమిటంటే.. ఈ వైరస్ ప్రభావం ఇప్పట్లో ముగియదు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) జనరల్ టెడ్రోస్ అధనామ్ గెబ్రియేసన్ స్పష్టం చేశారు. వైరస్ను ఎదుర్కునేందుకు వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో ప్రపంచ వ్యాప్తంగా అనేక పరిశోధనా సంస్థలు నిమగ్నమై ఉన్నాయి. అయినప్పటికీ, ఈ ప్రయత్నం కూడా విజయవంతం అవుతుందనే నమ్మకం లేదని డబ్ల్యుహెచ్ఓ అత్యవసర విభాగాధిపతి మైక్ రేయాన్ అభిప్రాయపడ్డారు. ఈ సమయంలో చేయగలిగింది ఒక్కటే.. వైరస్ సోకిన వారిని గుర్తించడం.. వారితో సన్నిహితంగా మెలిగిన వారికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం వంటి చర్యల ద్వారా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చని రేయాన్ సూచించారు. ఈ విధానాన్ని అనుసరిస్తూ వ్యాప్తిని కొంత నిరోధించిన దేశాలు జపాన్, దక్షిణ కొరియాలను ఉదాహరణగా చూపించారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







