కరోనా ఇప్పట్లో వదలదు:WHO
- June 30, 2020
జెనీవా:కరోనా వైరస్ మన జీవితాల్లోకి వచ్చి ఆరు నెలలు అయింది. ప్రపంచ వ్యాప్తంగా కోటి మందికి పైగా వైరస్ బారిన పడ్డారు. 5 లక్షమంది మహమ్మారి బారిన పడి మరణించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో కొన్ని దేశాలు పురోగతిని సాధించినా.. భయంకరమైన వాస్తవం ఏమిటంటే.. ఈ వైరస్ ప్రభావం ఇప్పట్లో ముగియదు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) జనరల్ టెడ్రోస్ అధనామ్ గెబ్రియేసన్ స్పష్టం చేశారు. వైరస్ను ఎదుర్కునేందుకు వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో ప్రపంచ వ్యాప్తంగా అనేక పరిశోధనా సంస్థలు నిమగ్నమై ఉన్నాయి. అయినప్పటికీ, ఈ ప్రయత్నం కూడా విజయవంతం అవుతుందనే నమ్మకం లేదని డబ్ల్యుహెచ్ఓ అత్యవసర విభాగాధిపతి మైక్ రేయాన్ అభిప్రాయపడ్డారు. ఈ సమయంలో చేయగలిగింది ఒక్కటే.. వైరస్ సోకిన వారిని గుర్తించడం.. వారితో సన్నిహితంగా మెలిగిన వారికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం వంటి చర్యల ద్వారా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చని రేయాన్ సూచించారు. ఈ విధానాన్ని అనుసరిస్తూ వ్యాప్తిని కొంత నిరోధించిన దేశాలు జపాన్, దక్షిణ కొరియాలను ఉదాహరణగా చూపించారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







