జులైలో మరో 15 డెస్టినేషన్స్తో ఎతిహాద్ విస్తరణ
- June 30, 2020అబుధాబి కేంద్రంగా పనిచేస్తోన్న ఎతిహాద్ ఎయిర్వేస్, మరో 15 డెస్టినేషన్స్ని వచ్చే నెలలో యాడ్ చేయనుంది. భారత ఉప ఖండంలో పలు ప్రముఖ నగరాల్ని ఇందులో పొందుపరిచారు. జూన్ 24న ఏథెన్స్, గ్రీస్లను లిస్ట్లో యాడ్ చేసిన విషయం విదితమే. ప్రస్తుతం 25 డెస్టినేషన్స్కి విమానాలు నడుస్తున్నాయి. కాగా, జులై 16 నుంచి భారత నగరాలైన బెంగళూరు, చెన్నయ్, ఢిల్లీ, హైదరాబాద్, కోచి, కోజికోడ్ మరియు ముంబైలకు విమానాలు నడపనున్నారు. జులై 16 నుంచి మాల్దీవ్కి కూడా విమాన సర్వీసులు నడుస్తాయి. పాకిస్తాన్ విషయానికొస్తే, కేవలం ఇన్బౌండ్ విమానాలు మాత్రమే మూడు పాకిస్తానీ నగరాలు ఇస్లామాబాద్, కరాచీ, లాహోర్లకు పరిమితం చేశారు. మిడిల్ ఈస్ట్లో అమ్మాన్ మరియు కైరోలకు జులై 16 నుంచి విమానలు నడుపుతుంది. ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికంటే ముందే ప్రయాణీకులు కోవిడ్ 19 పరీక్ష చేయించుకోవాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు