ధమ్మామ్: వచ్చే నెలలో కింగ్ ఫహ్ద్ కాజ్ వే ప్రారంభించే అవకాశాలు
- July 01, 2020
ధమ్మామ్:దాదాపుగా నాలుగు నెలలుగా మూతపడిన కింగ్ ఫహ్ద్ కాజ్ వేపై ఎట్టకేలకు వాహనాలను అనుమతించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సౌదీ, బహ్రెయిన్ ను కలిపే ఈ కీలక కాజ్ వేను ఈ నెలాఖరు నాటికి ప్రారంభించే యోచనలో ఉంది బహ్రెయిన్ ప్రభుత్వం. కాజ్ వేపై వాహనాలను అనుమతించటం ద్వారా దేశంలో పర్యాటక రంగానికి ఊతం ఇచ్చినట్లు అవుతుంది. దీనికి సంబంధించి సమావేశమైన బహ్రెయిన్ కోఆర్డినేషన్ కమిటీ..కాజ్ వే రహదారిని జులై 27 నుంచి ప్రారంభించే అవకాశాలపై చర్చించింది. ప్రస్తుతం సాధారణ పరిస్థితులను నెలకొల్పడంలో భాగంగా అన్ లాక్ ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇందుకు అనుకూల వాతావరణం నెలకొల్పేందుకు గల్ఫ్ దేశాల మండలి కూడా దేశాల మధ్య సరిహద్దు రవాణాకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో సౌదీ, బహ్రెయిన్ ను కలిసే కింగ్ ఫహ్ద్ కాజ్ వేపై వాహనాలను అనుమతించేందుకు కసరత్తు చేస్తోంది బహ్రెయిన్. తద్వారా బహ్రెయిన్ లో పర్యాటక రంగానికి ఎంతో ఊరట కలగనుంది. గల్ఫ్ దేశాల నుంచి వచ్చే పర్యటకులు, ముఖ్యంగా సౌదీ నుంచి వచ్చే వారికి కింగ్ ఫహ్ద్ కాజ్ వే ఎంతగానో ఉపకరిస్తుంది. నిజానికి బహ్రెయిన్ లో పర్యటించే వారిలో సౌదీ నుంచి వచ్చే వారే ఎక్కువగా ఉంటారు. గతేడాది మొత్తం 11 మిలియన్ల మంది బహ్రెయిన్ లో పర్యటిస్తే అందులో 88 శాతం సౌదీ నుంచి వచ్చిన వారే. కింగ్ ఫహ్ద్ పై వాహనాల అనుమతి బహ్రెయిన్ ఎంత కీలకమైందంటే..ఈ కాజ్ వే పై ప్రతి రోజు దాదాపు 75 వేల మంది ప్రయాణిస్తుంటారు. అయితే..కరోనా వైరస్ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు పాటించేలా చర్యలు తీసుకుంటామని కూడా బహ్రెయిన్ కోఆర్డినేషన్ కమిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన