ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్న తెలంగాణ ఎన్నారైలు

- July 01, 2020 , by Maagulf
ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్న తెలంగాణ ఎన్నారైలు

షార్జా:నాలుగు నెలలుగా కరోనా వైరస్‌ నేపథ్యంలో షార్జా లో ఇబ్బందులు పడుతున్న 40 మంది తెలంగాణ వాసులు ఎట్టకేలకు హైదరాబాద్ ‌కి పయనమయ్యారు.ఈ క్రమంలో విశేష సహాయ సహకారాలు అందించిన ఐఏఎస్‌ ప్రెసిడెంట్‌ ఇ.పి. జాన్సన్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ వై.ఎ. రహీమ్ తదితరులకు టిపిసిసి ఎన్నారై సెల్‌ దుబాయ్‌, యూఏఈ కన్వీనర్‌ ఎస్‌వి రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. షార్జా పోలీస్‌తో కలిసి షెల్టర్‌ అందించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఐఏఎస్‌ ఆఫీస్‌ బేరర్స్‌ జనరల్‌ సెక్రెటరీ అబ్దుల్లా మల్లాచెర్రి, యాక్టింగ్‌ ట్రెజరర్‌ షాజి జాన్‌, షహాల్‌ హస్సాన్‌, అహ్మద్‌ షిబ్లీ, హారిస్‌ కొడంగల్లుర్‌ ఇతర సభ్యులకు కూడా కృతజ్ఞతలు తెలిపారు ఎస్‌వి రెడ్డి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com