మసీదులలో ప్రార్ధనలపై కరోనా ఎఫెక్ట్..మరికొంత కాలం మూసివేత
- July 03, 2020మనామ:కరోనా తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో మసీదులలో సామూహిక ప్రార్ధనలను రద్దు చేసింది బహ్రెయిన్. ఈ మేరకు సుప్రీం కౌన్సిల్ తమ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేసింది. కరోనా వైరస్ శర వేగంగా వ్యాపిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. నిజానికి గతంతో పోలిస్తే జూన్ నెలలో పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతున్నాయి. కరోనా బారిన పడి చనిపోతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. జనం భౌతిక దూరం పాటించకపోవటం వల్లే వైరస్ వ్యాప్తి పెరుగుతోందని వైద్యశాఖ కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన సుప్రీం కౌన్సిల్..మసీదులను మరికొంత కాలం మూసివేయాలని నిర్ణయించింది. శుక్రవారం ప్రార్ధనలను కూడా రద్దు చేసింది. ప్రతి రెండు వారాలకు ఓ సారి సమావేశమై అప్పటి పరిస్థితులకు అనుగుణంగా తమ నిర్ణయాలను సమీక్షించుకుంటామని కూడా వెల్లడించింది.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రథినిధి, బహ్రెయిన్)
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ