ట్యాక్సీ ఓనర్స్, మహిళలకు లోన్ స్కీం ప్రకటించిన ఒమన్
- July 03, 2020మస్కట్:కరోనా సంక్షోభం నేపథ్యంలో కొన్ని రంగాలను ఆదుకునేందుకు ఒమన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. స్వయం ఉపాధి పొందుతున్న వారికి అలాగే చిన్న సూక్ష్మ పరిశ్రమ రంగాలకు రుణాలు ఇచ్చేందుకు లోన్ స్కీం ప్రకటించింది. దీనికి సంబంధించి ప్రణాళికను కూడా పూర్తి చేసినట్లు ఒమన్ డెవలప్మెంట్ బ్యాంక్ సీఈవో డాక్టర్ అబ్దుల్లాజీజ్ బిన్ మొహమ్మద్ అల్ హినై తెలిపారు. ఈ లోన్ స్కీం ద్వారా ఫుల్ టైం ట్యాక్సీ నడిపేవారికి, డ్రైవింగ్ శిక్షణ ఇచ్చే వారికి రుణాలు అందినున్నారు. అలాగే వివిధ రంగాల్లో స్వయం ఉపాధి పొందుతున్న మహిళలకు కూడా లోన్ స్కీం ద్వారా లబ్ధిపొందనున్నారు. ముఖ్యంగా కాస్మటిక్ షాప్స్, బేబి సిట్టర్స్ కి రుణాలు ఇవ్వనున్నారు. ఇక కరోనా కారణంగా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కుంటున్న మైక్రో ఎంటర్ ప్రైజెస్ నిర్వాహకులకు కూడా రుణాలు అందించనున్నారు. నాలుగేళ్లలో రుణాలను తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి