గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన హీరో అల్లు శిరీష్
- July 04, 2020
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా హీరో విశ్వక్ సేన్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు తన ఇంటి గార్డెన్ లో మొక్కలు నాటిన హీరో అల్లు శిరిష్. ఈ సందర్భంగా శిరీష్ మాట్లాడుతూ ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పడున్న జీవినవిధానంలో పర్యవరణ పరిరక్షణ అత్యంత అవసరం. అందుకే విధిగా మనందరం స్వచ్ఛందంగా మొక్కలు నాటాలని కోరుతున్నాను. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా విశ్వక్ సేన్ నాకిచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నా మేనల్లుడు ఆర్నావ్ మేనకోడల్లు అన్విత, సమారా, నివ్రితిలను ఈ కార్యక్రమానికి నామినేట్ చేస్తున్నాను. రానున్న కొత్త తరానికి చెట్లను, ఏ విధంగా నాటాలి, పెంచాలనే విషయం తెలియడం చాలా అవసరమని అన్నారు. అందుకే తన మేనల్లుడు, మేనకోడల్లకి ఈ ఛాలెంజ్ స్వీకరించాల్సిందిగా నామినేట్ చేస్తున్నట్లు తెలిపారు. అల్లు శిరీష్ ప్రస్తుతం తన తదుపరి సినిమాకి సంబంధించిన కార్యక్రమాల్లో ఉన్నారు. ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటణ త్వరలోనే రాబోతుంది.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







