కరోనా విషయంలో భారత్ తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయం:WHO
- July 04, 2020
కరోనా విషయంలో భారత్ తీసుకుంటున్న చర్యలును ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసించింది. భారతదేశానికి జనాభాయే పెద్ద సవాలని.. కానీ, దానిని కూడా అధిగమించి కరోనాను ఎదుర్కోంటుందని పేర్కొంది. మొదటి నుంచి డబ్ల్యూహెచ్ఓ సూచనలను పాటిస్తుందని తెలిపింది. కరోనా కట్టడిలో భాగంగా.. వ్యాధినిరోదక శక్తి పెంచుకోవడం, లాక్డౌన్ విధించడం, లాక్డౌన్కి సడలింపులు ఇవ్వడం అన్నీ పద్దతి ప్రకారం జరుగుతున్నాయని డబ్ల్యూహచ్ఓ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ అన్నారు. భారత్ లో ప్రస్తుతం ఉన్న నాయకత్వమే ఆ దేశానికి బలమని అన్నారు. ప్రస్తుతం దేశంలో రోజుకు రెండు లక్షల కరోనా టెస్టులు జరగుతున్నాయని.. టెస్టింగ్ కిట్ల విషయంలో భారత్ స్వయం సమృద్దమైందని అన్నారు. భవిష్యత్ లో మరిన్ని ఎక్కువ టెస్టులు చేసే అవకాశం ఉందని అన్నారు. అయితే, కరోనాకు సంబందించిన డేటాను తెలియజేయటంలో మరింత శ్రద్ధ వహించాలని అన్నారు. కరోనా టెస్టులు, కేసులు, మరణాలు మాత్రమే తెలియజేస్తే.. ప్రజలకు కొంత సమాచారం మాత్రమే తెలుస్తుందని అన్నారు. కానీ, కొన్ని అంశాలతో పోలికలను చూపిస్తూ డేటా తయారు చేయాలని అన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు