గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన హీరో అల్లు శిరీష్
- July 04, 2020రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా హీరో విశ్వక్ సేన్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు తన ఇంటి గార్డెన్ లో మొక్కలు నాటిన హీరో అల్లు శిరిష్. ఈ సందర్భంగా శిరీష్ మాట్లాడుతూ ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పడున్న జీవినవిధానంలో పర్యవరణ పరిరక్షణ అత్యంత అవసరం. అందుకే విధిగా మనందరం స్వచ్ఛందంగా మొక్కలు నాటాలని కోరుతున్నాను. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా విశ్వక్ సేన్ నాకిచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నా మేనల్లుడు ఆర్నావ్ మేనకోడల్లు అన్విత, సమారా, నివ్రితిలను ఈ కార్యక్రమానికి నామినేట్ చేస్తున్నాను. రానున్న కొత్త తరానికి చెట్లను, ఏ విధంగా నాటాలి, పెంచాలనే విషయం తెలియడం చాలా అవసరమని అన్నారు. అందుకే తన మేనల్లుడు, మేనకోడల్లకి ఈ ఛాలెంజ్ స్వీకరించాల్సిందిగా నామినేట్ చేస్తున్నట్లు తెలిపారు. అల్లు శిరీష్ ప్రస్తుతం తన తదుపరి సినిమాకి సంబంధించిన కార్యక్రమాల్లో ఉన్నారు. ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటణ త్వరలోనే రాబోతుంది.
తాజా వార్తలు
- ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం