ప్రవాసీయులకు షాక్..విదేశీయుల కోటాను కుదిస్తూ కువైట్ కేబినెట్ ఆమోదం
- July 05, 2020
కువైట్ సిటీ:ప్రవాస భారతీయులతో పాటు తమ దేశంలోని విదేశీయులకు షాకిచ్చింది కువైట్ ప్రభుత్వం. ప్రవాసీయుల సంఖ్యను కుదించటమే లక్ష్యంగా విదేశీయుల కోటాను ఖరారు చేస్తూ చేసిన తీర్మానానికి కువైట్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అంతేకాదు..ఐదుగురు ఎంపీల బృందం సమర్పించిన ముసాయిదా బిల్లు రాజ్యంగపరంగా, చట్టపరంగా సరైన విధానంలోనే ఉందని జాతీయ అసెంబ్లీ లీగల్, లెజిస్లేటీవ్ కమిటీ కూడా నిర్ధారించింది. ఈ ముసాయిదా బిల్లు అమలులోకి వస్తే కువైట్ లో ఉంటున్న పలు దేశస్తులపై ప్రభావం చూపుతుంది. ప్రవాస భారతీయులు కువైట్ దేశస్థుల సంఖ్యలో 15 శాతానికి మించి ఉండకూడదు. అలాగే ఈజిప్టియన్లు, శ్రీలంకన్లు, ఫిలిపినోస్ కు సంబంధించి 10 శాతం చొప్పున మాత్రమే ఉండాలి. బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్, వియత్నంకు సంబంధించి ఒక్కో దేశం నుంచి 3 శాతం మంది మాత్రమే ఉండాలి. ఈ లెక్కన ఆయా దేశాల నుంచి వచ్చి కువైట్ లో ఉంటున్న వారిపై తీవ్ర ప్రభావం పడనుంది. 2018 జనాభా లెక్కల ప్రకారం కువైట్ జనాభా 41.4 లక్షలు. ఇక నుంచి ఈ మొత్తం జనాభాలో ప్రవాస భారతీయుల సంఖ్య 15 శాతం దాటకూడదు. ప్రస్తుతం కువైట్ లో దాదాపు 10 లక్షల జనాభా ఉన్నట్లు ఓ అంచనా. ప్రస్తుత కోటా ప్రకారం 6 లక్షల మందికి ప్రవాసభారతీయులను కుదించనున్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







