ప్రవాసీయులకు షాక్..విదేశీయుల కోటాను కుదిస్తూ కువైట్ కేబినెట్ ఆమోదం
- July 05, 2020
కువైట్ సిటీ:ప్రవాస భారతీయులతో పాటు తమ దేశంలోని విదేశీయులకు షాకిచ్చింది కువైట్ ప్రభుత్వం. ప్రవాసీయుల సంఖ్యను కుదించటమే లక్ష్యంగా విదేశీయుల కోటాను ఖరారు చేస్తూ చేసిన తీర్మానానికి కువైట్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అంతేకాదు..ఐదుగురు ఎంపీల బృందం సమర్పించిన ముసాయిదా బిల్లు రాజ్యంగపరంగా, చట్టపరంగా సరైన విధానంలోనే ఉందని జాతీయ అసెంబ్లీ లీగల్, లెజిస్లేటీవ్ కమిటీ కూడా నిర్ధారించింది. ఈ ముసాయిదా బిల్లు అమలులోకి వస్తే కువైట్ లో ఉంటున్న పలు దేశస్తులపై ప్రభావం చూపుతుంది. ప్రవాస భారతీయులు కువైట్ దేశస్థుల సంఖ్యలో 15 శాతానికి మించి ఉండకూడదు. అలాగే ఈజిప్టియన్లు, శ్రీలంకన్లు, ఫిలిపినోస్ కు సంబంధించి 10 శాతం చొప్పున మాత్రమే ఉండాలి. బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్, వియత్నంకు సంబంధించి ఒక్కో దేశం నుంచి 3 శాతం మంది మాత్రమే ఉండాలి. ఈ లెక్కన ఆయా దేశాల నుంచి వచ్చి కువైట్ లో ఉంటున్న వారిపై తీవ్ర ప్రభావం పడనుంది. 2018 జనాభా లెక్కల ప్రకారం కువైట్ జనాభా 41.4 లక్షలు. ఇక నుంచి ఈ మొత్తం జనాభాలో ప్రవాస భారతీయుల సంఖ్య 15 శాతం దాటకూడదు. ప్రస్తుతం కువైట్ లో దాదాపు 10 లక్షల జనాభా ఉన్నట్లు ఓ అంచనా. ప్రస్తుత కోటా ప్రకారం 6 లక్షల మందికి ప్రవాసభారతీయులను కుదించనున్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







