ప్రవాసీయులకు షాక్..విదేశీయుల కోటాను కుదిస్తూ కువైట్ కేబినెట్ ఆమోదం
- July 05, 2020
కువైట్ సిటీ:ప్రవాస భారతీయులతో పాటు తమ దేశంలోని విదేశీయులకు షాకిచ్చింది కువైట్ ప్రభుత్వం. ప్రవాసీయుల సంఖ్యను కుదించటమే లక్ష్యంగా విదేశీయుల కోటాను ఖరారు చేస్తూ చేసిన తీర్మానానికి కువైట్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అంతేకాదు..ఐదుగురు ఎంపీల బృందం సమర్పించిన ముసాయిదా బిల్లు రాజ్యంగపరంగా, చట్టపరంగా సరైన విధానంలోనే ఉందని జాతీయ అసెంబ్లీ లీగల్, లెజిస్లేటీవ్ కమిటీ కూడా నిర్ధారించింది. ఈ ముసాయిదా బిల్లు అమలులోకి వస్తే కువైట్ లో ఉంటున్న పలు దేశస్తులపై ప్రభావం చూపుతుంది. ప్రవాస భారతీయులు కువైట్ దేశస్థుల సంఖ్యలో 15 శాతానికి మించి ఉండకూడదు. అలాగే ఈజిప్టియన్లు, శ్రీలంకన్లు, ఫిలిపినోస్ కు సంబంధించి 10 శాతం చొప్పున మాత్రమే ఉండాలి. బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్, వియత్నంకు సంబంధించి ఒక్కో దేశం నుంచి 3 శాతం మంది మాత్రమే ఉండాలి. ఈ లెక్కన ఆయా దేశాల నుంచి వచ్చి కువైట్ లో ఉంటున్న వారిపై తీవ్ర ప్రభావం పడనుంది. 2018 జనాభా లెక్కల ప్రకారం కువైట్ జనాభా 41.4 లక్షలు. ఇక నుంచి ఈ మొత్తం జనాభాలో ప్రవాస భారతీయుల సంఖ్య 15 శాతం దాటకూడదు. ప్రస్తుతం కువైట్ లో దాదాపు 10 లక్షల జనాభా ఉన్నట్లు ఓ అంచనా. ప్రస్తుత కోటా ప్రకారం 6 లక్షల మందికి ప్రవాసభారతీయులను కుదించనున్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- *బ్రేకింగ్: విమాన సర్వీసులను పునరుద్ధరించిన ఎమిరేట్స్! కన్ఫర్మ్డ్ టికెట్ ఉన్న ప్రయాణీకులకే!
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!









