ప్రవాసీయులకు షాక్..విదేశీయుల కోటాను కుదిస్తూ కువైట్ కేబినెట్ ఆమోదం
- July 05, 2020
కువైట్ సిటీ:ప్రవాస భారతీయులతో పాటు తమ దేశంలోని విదేశీయులకు షాకిచ్చింది కువైట్ ప్రభుత్వం. ప్రవాసీయుల సంఖ్యను కుదించటమే లక్ష్యంగా విదేశీయుల కోటాను ఖరారు చేస్తూ చేసిన తీర్మానానికి కువైట్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అంతేకాదు..ఐదుగురు ఎంపీల బృందం సమర్పించిన ముసాయిదా బిల్లు రాజ్యంగపరంగా, చట్టపరంగా సరైన విధానంలోనే ఉందని జాతీయ అసెంబ్లీ లీగల్, లెజిస్లేటీవ్ కమిటీ కూడా నిర్ధారించింది. ఈ ముసాయిదా బిల్లు అమలులోకి వస్తే కువైట్ లో ఉంటున్న పలు దేశస్తులపై ప్రభావం చూపుతుంది. ప్రవాస భారతీయులు కువైట్ దేశస్థుల సంఖ్యలో 15 శాతానికి మించి ఉండకూడదు. అలాగే ఈజిప్టియన్లు, శ్రీలంకన్లు, ఫిలిపినోస్ కు సంబంధించి 10 శాతం చొప్పున మాత్రమే ఉండాలి. బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్, వియత్నంకు సంబంధించి ఒక్కో దేశం నుంచి 3 శాతం మంది మాత్రమే ఉండాలి. ఈ లెక్కన ఆయా దేశాల నుంచి వచ్చి కువైట్ లో ఉంటున్న వారిపై తీవ్ర ప్రభావం పడనుంది. 2018 జనాభా లెక్కల ప్రకారం కువైట్ జనాభా 41.4 లక్షలు. ఇక నుంచి ఈ మొత్తం జనాభాలో ప్రవాస భారతీయుల సంఖ్య 15 శాతం దాటకూడదు. ప్రస్తుతం కువైట్ లో దాదాపు 10 లక్షల జనాభా ఉన్నట్లు ఓ అంచనా. ప్రస్తుత కోటా ప్రకారం 6 లక్షల మందికి ప్రవాసభారతీయులను కుదించనున్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







