వలస కార్మికుల పెండింగ్ వేతన సమస్యను పరిష్కరించిన బహ్రెయిన్

- July 05, 2020 , by Maagulf
వలస కార్మికుల పెండింగ్ వేతన సమస్యను పరిష్కరించిన బహ్రెయిన్

మనామా:కొద్ది నెలలుగా జీతాలు లేకుండా అవస్థలు పడుతున్న వలస కార్మికుల సమస్యను బహ్రెయిన్ కార్మిక శాఖ పరిష్కరించింది. వారికి రావాల్సిన బకాయి వేతనాలు చెల్లించేలా పరిష్కార మార్గం చూపింది. కరోనా విపత్తుకు తోడు చమురు రంగం ఎదుర్కుంటున్న ఒడిదుడుకులతో కొన్నాళ్లుకు వలస కార్మికులకు జీతాలు అందక అవస్థలు పడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బ్లూ కాలర్ కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ నేపథ్యంలో పదుల సంఖ్యలో వలస కార్మికులు బకాయి జీతాల కోసం ఇటీవల కార్మిక మంత్రిత్వ శాఖ కార్యాలయం ముందు ఆందోళనకు దిగిన విషయం తెలిసింది. రెండు నిర్మాణ సంస్థలకు చెందిన దాదాపు 40 మంది ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. తమకు 8 నెలలుగా జీతాలు అందటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కాస్తా వైరల్ గా మారటంతో రంగంలోకి దిగిన కార్మిక శాఖ వలస కార్మికుల సమస్యను పరిష్కరించేందుకు ఆయా సంస్థలు చొరవ తీసుకోలేదని నిర్ధారణకు వచ్చింది. కార్మికుల పెండింగ్ జీతాలు చెల్లించే దిశగా పరిష్కార మార్గం చూపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com