వలస కార్మికుల పెండింగ్ వేతన సమస్యను పరిష్కరించిన బహ్రెయిన్
- July 05, 2020మనామా:కొద్ది నెలలుగా జీతాలు లేకుండా అవస్థలు పడుతున్న వలస కార్మికుల సమస్యను బహ్రెయిన్ కార్మిక శాఖ పరిష్కరించింది. వారికి రావాల్సిన బకాయి వేతనాలు చెల్లించేలా పరిష్కార మార్గం చూపింది. కరోనా విపత్తుకు తోడు చమురు రంగం ఎదుర్కుంటున్న ఒడిదుడుకులతో కొన్నాళ్లుకు వలస కార్మికులకు జీతాలు అందక అవస్థలు పడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బ్లూ కాలర్ కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ నేపథ్యంలో పదుల సంఖ్యలో వలస కార్మికులు బకాయి జీతాల కోసం ఇటీవల కార్మిక మంత్రిత్వ శాఖ కార్యాలయం ముందు ఆందోళనకు దిగిన విషయం తెలిసింది. రెండు నిర్మాణ సంస్థలకు చెందిన దాదాపు 40 మంది ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. తమకు 8 నెలలుగా జీతాలు అందటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కాస్తా వైరల్ గా మారటంతో రంగంలోకి దిగిన కార్మిక శాఖ వలస కార్మికుల సమస్యను పరిష్కరించేందుకు ఆయా సంస్థలు చొరవ తీసుకోలేదని నిర్ధారణకు వచ్చింది. కార్మికుల పెండింగ్ జీతాలు చెల్లించే దిశగా పరిష్కార మార్గం చూపింది.
తాజా వార్తలు
- ఉమ్ రామూల్, అల్ బర్షాలోని ఆర్టీఏ కేంద్రాలు అప్గ్రేడ్
- దుబాయ్ కు పోటెత్తుతున్న భారతీయులు..!
- సౌదీ రాజుకు HM సుల్తాన్ సంతాపం
- టాప్ 20 ప్రపంచ కార్ మార్కెట్లలో సౌదీ అరేబియా
- ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
- యూఏఈలో వేసవి ప్రారంభం వరకు వర్షాలు..!
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు