వలస కార్మికుల పెండింగ్ వేతన సమస్యను పరిష్కరించిన బహ్రెయిన్
- July 05, 2020మనామా:కొద్ది నెలలుగా జీతాలు లేకుండా అవస్థలు పడుతున్న వలస కార్మికుల సమస్యను బహ్రెయిన్ కార్మిక శాఖ పరిష్కరించింది. వారికి రావాల్సిన బకాయి వేతనాలు చెల్లించేలా పరిష్కార మార్గం చూపింది. కరోనా విపత్తుకు తోడు చమురు రంగం ఎదుర్కుంటున్న ఒడిదుడుకులతో కొన్నాళ్లుకు వలస కార్మికులకు జీతాలు అందక అవస్థలు పడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బ్లూ కాలర్ కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ నేపథ్యంలో పదుల సంఖ్యలో వలస కార్మికులు బకాయి జీతాల కోసం ఇటీవల కార్మిక మంత్రిత్వ శాఖ కార్యాలయం ముందు ఆందోళనకు దిగిన విషయం తెలిసింది. రెండు నిర్మాణ సంస్థలకు చెందిన దాదాపు 40 మంది ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. తమకు 8 నెలలుగా జీతాలు అందటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కాస్తా వైరల్ గా మారటంతో రంగంలోకి దిగిన కార్మిక శాఖ వలస కార్మికుల సమస్యను పరిష్కరించేందుకు ఆయా సంస్థలు చొరవ తీసుకోలేదని నిర్ధారణకు వచ్చింది. కార్మికుల పెండింగ్ జీతాలు చెల్లించే దిశగా పరిష్కార మార్గం చూపింది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ