వలస కార్మికుల పెండింగ్ వేతన సమస్యను పరిష్కరించిన బహ్రెయిన్
- July 05, 2020
మనామా:కొద్ది నెలలుగా జీతాలు లేకుండా అవస్థలు పడుతున్న వలస కార్మికుల సమస్యను బహ్రెయిన్ కార్మిక శాఖ పరిష్కరించింది. వారికి రావాల్సిన బకాయి వేతనాలు చెల్లించేలా పరిష్కార మార్గం చూపింది. కరోనా విపత్తుకు తోడు చమురు రంగం ఎదుర్కుంటున్న ఒడిదుడుకులతో కొన్నాళ్లుకు వలస కార్మికులకు జీతాలు అందక అవస్థలు పడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బ్లూ కాలర్ కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ నేపథ్యంలో పదుల సంఖ్యలో వలస కార్మికులు బకాయి జీతాల కోసం ఇటీవల కార్మిక మంత్రిత్వ శాఖ కార్యాలయం ముందు ఆందోళనకు దిగిన విషయం తెలిసింది. రెండు నిర్మాణ సంస్థలకు చెందిన దాదాపు 40 మంది ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. తమకు 8 నెలలుగా జీతాలు అందటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కాస్తా వైరల్ గా మారటంతో రంగంలోకి దిగిన కార్మిక శాఖ వలస కార్మికుల సమస్యను పరిష్కరించేందుకు ఆయా సంస్థలు చొరవ తీసుకోలేదని నిర్ధారణకు వచ్చింది. కార్మికుల పెండింగ్ జీతాలు చెల్లించే దిశగా పరిష్కార మార్గం చూపింది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?