విమానాల రాకతో దుబాయ్ ఎయిర్ పోర్టుకు పాతవైభవం..
- July 07, 2020
దుబాయ్:దుబాయ్ విమానాశ్రయానికి విమానాల రాకతో పాత వైభవం దిశగా కీలక అడుగులు పడుతున్నాయని అధికారులు అభిప్రాయపడ్డారు. దుబాయ్ ఎయిర్ పోర్టుకు విమానాల రాకతో దేశీయ విమానయాన రంగానికి ఎంతో ప్రయోజనకరంగా ఉండనుంది. ఈ చర్యలన్ని యూఏఈని మరింత పటిష్టపరిచేందుకు దోహదం చేస్తాయని అధికారులు చెబుతున్నారు. ఆర్ధిక, వాణిజ్య కార్యకలాపాల పునరుత్తేజానికి కూడా ఉపయుక్తంగా ఉంటుందని అంటున్నారు. దుబాయ్ విమానాశ్రయానికి విమానాల రాకకు అనుమతి ఇవ్వటంతో పర్యాటక రంగం అభివృద్ధికి, విదేశీ పెట్టుబడుల ఆకర్షణకు బూస్టింగ్ ఇస్తుందన్నారు. ఇదిలాఉంటే..పలు దేశాల్లోని యూఏఈ ప్రవాసీయులు ఇవాల్టినుంచి దుబాయ్ విమానాశ్రయం ద్వారా దేశానికి చేరుకోనున్నట్లు డైరెక్టరేట్ స్పష్టం చేసింది. దుబాయ్ విమానాశ్రయం ద్వారా దేశానికి చేరుకుంటున్న ప్రవాసీయులు అందర్ని 'వెల్కం అగేన్ ఇన్ యువర్ సెకండ్ హోమ్' నినాదంతో స్వాగతం పలుకుతున్నట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







