విమానాల రాకతో దుబాయ్ ఎయిర్ పోర్టుకు పాతవైభవం..
- July 07, 2020
దుబాయ్:దుబాయ్ విమానాశ్రయానికి విమానాల రాకతో పాత వైభవం దిశగా కీలక అడుగులు పడుతున్నాయని అధికారులు అభిప్రాయపడ్డారు. దుబాయ్ ఎయిర్ పోర్టుకు విమానాల రాకతో దేశీయ విమానయాన రంగానికి ఎంతో ప్రయోజనకరంగా ఉండనుంది. ఈ చర్యలన్ని యూఏఈని మరింత పటిష్టపరిచేందుకు దోహదం చేస్తాయని అధికారులు చెబుతున్నారు. ఆర్ధిక, వాణిజ్య కార్యకలాపాల పునరుత్తేజానికి కూడా ఉపయుక్తంగా ఉంటుందని అంటున్నారు. దుబాయ్ విమానాశ్రయానికి విమానాల రాకకు అనుమతి ఇవ్వటంతో పర్యాటక రంగం అభివృద్ధికి, విదేశీ పెట్టుబడుల ఆకర్షణకు బూస్టింగ్ ఇస్తుందన్నారు. ఇదిలాఉంటే..పలు దేశాల్లోని యూఏఈ ప్రవాసీయులు ఇవాల్టినుంచి దుబాయ్ విమానాశ్రయం ద్వారా దేశానికి చేరుకోనున్నట్లు డైరెక్టరేట్ స్పష్టం చేసింది. దుబాయ్ విమానాశ్రయం ద్వారా దేశానికి చేరుకుంటున్న ప్రవాసీయులు అందర్ని 'వెల్కం అగేన్ ఇన్ యువర్ సెకండ్ హోమ్' నినాదంతో స్వాగతం పలుకుతున్నట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







