కువైట్:ట్రాన్సాక్షన్స్ పై ఉన్న నిషేధాన్ని తాత్కాలికంగా తొలగించిన అంతర్గత మంత్రిత్వశాఖ
- July 07, 2020
కువైట్ సిటీ:కొందరు పౌరులు, ప్రవాసీయుల ట్రాన్సాక్షన్ పై విధించిన నిషేధాన్ని కువైట్ అంతర్గత మంత్రిత్వశాఖ తాత్కాలికంగా తొలగించింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ట్రాఫిక్, మున్సిపాలిటి, వాణిజ్య మంత్రిత్వ శాఖ విభాగాలకు సంబంధించి నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన పౌరులు, ప్రవాసీయుల ట్రాన్సాక్షన్స్ ను కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ బ్లాక్ చేసిన విషయం తెలిసిందే. అయితే..ఈ నిషేధాన్ని రెండు వారాల పాటు అంటే ఈ నెల 16 వరకు తొలగించారు. ఈ రెండు వారాల్లో డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్, కార్ రిజిస్ట్రేషన్స్, రెసిడెన్సీ అనుమతులకు సంబంధించి పెండింగ్ ట్రాన్సాక్షన్స్ ను పూర్తి చేసుకునే వెసులుబాటు కలిగింది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







