కువైట్:ట్రాన్సాక్షన్స్ పై ఉన్న నిషేధాన్ని తాత్కాలికంగా తొలగించిన అంతర్గత మంత్రిత్వశాఖ
- July 07, 2020
కువైట్ సిటీ:కొందరు పౌరులు, ప్రవాసీయుల ట్రాన్సాక్షన్ పై విధించిన నిషేధాన్ని కువైట్ అంతర్గత మంత్రిత్వశాఖ తాత్కాలికంగా తొలగించింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ట్రాఫిక్, మున్సిపాలిటి, వాణిజ్య మంత్రిత్వ శాఖ విభాగాలకు సంబంధించి నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన పౌరులు, ప్రవాసీయుల ట్రాన్సాక్షన్స్ ను కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ బ్లాక్ చేసిన విషయం తెలిసిందే. అయితే..ఈ నిషేధాన్ని రెండు వారాల పాటు అంటే ఈ నెల 16 వరకు తొలగించారు. ఈ రెండు వారాల్లో డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్, కార్ రిజిస్ట్రేషన్స్, రెసిడెన్సీ అనుమతులకు సంబంధించి పెండింగ్ ట్రాన్సాక్షన్స్ ను పూర్తి చేసుకునే వెసులుబాటు కలిగింది.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







