కువైట్:ట్రాన్సాక్షన్స్ పై ఉన్న నిషేధాన్ని తాత్కాలికంగా తొలగించిన అంతర్గత మంత్రిత్వశాఖ
- July 07, 2020
కువైట్ సిటీ:కొందరు పౌరులు, ప్రవాసీయుల ట్రాన్సాక్షన్ పై విధించిన నిషేధాన్ని కువైట్ అంతర్గత మంత్రిత్వశాఖ తాత్కాలికంగా తొలగించింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ట్రాఫిక్, మున్సిపాలిటి, వాణిజ్య మంత్రిత్వ శాఖ విభాగాలకు సంబంధించి నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన పౌరులు, ప్రవాసీయుల ట్రాన్సాక్షన్స్ ను కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ బ్లాక్ చేసిన విషయం తెలిసిందే. అయితే..ఈ నిషేధాన్ని రెండు వారాల పాటు అంటే ఈ నెల 16 వరకు తొలగించారు. ఈ రెండు వారాల్లో డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్, కార్ రిజిస్ట్రేషన్స్, రెసిడెన్సీ అనుమతులకు సంబంధించి పెండింగ్ ట్రాన్సాక్షన్స్ ను పూర్తి చేసుకునే వెసులుబాటు కలిగింది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?