తెలంగాణ సచివాలయం కూల్చివేత పనులు ప్రారంభం
- July 07, 2020
హైదరాబాద్:తెలంగాణ సచివాలయం కూల్చివేత పనులు ప్రారంభం అయ్యాయి. హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అర్ధరాత్రి నుంచి కూల్చివేత పనులు మొదలుపెట్టారు. ముందుగా సి బ్లాక్ ను కూల్చుతున్నారు. దీంతో సెక్రెటేరియేట్ వైపు వెళ్లే దారుల్ని మూసివేశారు. సచివాలయ ప్రాంగణంలో మొత్తం 11 బ్లాక్స్ ఉన్నాయి. వీటిని ఇంప్లోషన్ విధానంతో పడగొడుతున్నారు. దీంతో 138 ఏళ్ళ సెక్రెటేరియేట్ చరిత్ర కాలగర్భంలో కలిసిపోనుంది.
ముఖ్యమంత్రి కార్యాలయం అయిన సమతా బ్లాక్ ఆరవ ఫ్లోర్ లో ఉంది. ఇటీవలే తెలంగాణకు అప్పగించిన ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం ఎల్, జె బ్లాక్ లు ఎనిమిదవ అంతస్థులో ఉన్నాయి. నార్త్ , సౌత్ , హెచ్ బ్లాక్ తెలంగాణ మంత్రుల కార్యాలయాల భవన సముదాయం డి బ్లాక్ మూడంస్థులలో ఉన్నాయి. వీటన్నింటిని కూల్చివేయనున్నారు అధికారులు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







