మనామా నుంచి శంషాబాద్ బయల్దేరిన ఛార్టర్డ్ ఫ్లైట్

- July 08, 2020 , by Maagulf
మనామా నుంచి శంషాబాద్ బయల్దేరిన ఛార్టర్డ్ ఫ్లైట్

మనామా:బహ్రెయిన్ నుండి శంషాబాద్ కు ఈరోజు ఉదయం 9.45 నిముషాలకు గల్ఫ్ ఎయిర్ ఛార్టర్డ్ ఫ్లైట్ లో హైదరాబాద్ కు 171 మంది కార్మికులు,మరియు హౌస్ మైడ్స్ పయన మయ్యారు. వీళ్ళందరికీ దగ్గర ఉండి కావలసిన అన్నిరకాల అనుమతులు తీసుకొని బహ్రెయిన్ లోని సోషల్ వర్కర్ వాసుదేవ రావు పంపించారు.ఎన్నో నెలలు నుండి ఉపాధి లేక తిండి లేక బాధపడుతున్న ఎంతో మందికి ఈ విమానంతో వారి సమస్యలకు పరిష్కారం చూపించారు.కొందరి వద్ద టిక్కెట్లకు కూడా డబ్బులు లేకపోతే,పారిశ్రామిక వేత్తలు తో మాట్లాడి,ఐదుగురికి ఉచిత టిక్కెట్లు ఇప్పించటంలో సఫలీకృతులయ్యారు వాసుదేవ రావు. వాళ్ళు సంతోషం తో స్వదేశానికి ప్రయాణ మయ్యారు.

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com