ఏపీలో కొత్తగా 1062 కరోనా పాజిటివ్ కేసులు
- July 08, 2020
అమరావతి:ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి కరళా నృత్యం చేస్తోంది. రాష్ట్రంలో రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రతి రోజు వెయ్యికిపైగా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 1062 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో రాష్ట్రానికి చెందినవి 1051 పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన మరో 11 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది.
తాజా కేసులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 22,259కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 10,894 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా మహమ్మారి బారినుండి కోలుకుని 11,101 మంది డిశ్చారి అయ్యారు. కరోనా మహమ్మారి బారిన పడి ఒక్కరోజే 12 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం మరణాల సంఖ్య 264కు చేరింది.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పీ)
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?