మస్కట్: ఎడారిలో చిక్కుకుపోయిన కుటుంబాన్ని రక్షించిన పోలీసులు
- July 08, 2020దక్షిణ అల్ షర్కియా గవర్నరేట్ పరిధిలో ఎడారిలో చిక్కుకుపోయిన ఓ కుటుంబాన్ని రాయల్ ఓమన్ పోలీసులు సురక్షితంగా రక్షించారు. రాయల్ ఓమన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నలుగురు కుటుంబసభ్యులు అల్ అష్కర ప్రాంతంలోని ఎడారిలో చిక్కుకుపోయారు. వారు ప్రయాణిస్తున్న వాహనం మధ్యలోనే ఆగిపోవటంతో వారు ఎడారిలో ఎటు పాలుపోని స్థితిలో సాయం కోసం ఎదురు చూస్తూ ఉండిపోయారు. అయితే..విషయం తెలుసుకున్న పోలీసులు, స్థానికుల సాయంతో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. చివరికి వారిని గుర్తించి, ఎడారి నుంచి నలుగుర్ని సురక్షితంగా రక్షించారు.
తాజా వార్తలు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!