మస్కట్ : నిబంధనలు పాటించని షాపుల మూసివేత

- July 09, 2020 , by Maagulf
మస్కట్ : నిబంధనలు పాటించని షాపుల మూసివేత

కరోనా మహమ్మారి నియంత్రణకు ప్రభుత్వం ఎన్ని జాగ్రత్త సూచనలు చేసినా..కొందరు మాత్రం వాటిని పట్టించుకోవటం లేదు. దీంతో మస్కట్ మున్సిపాలిటి అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. కరోనా నియంత్రణ కోసం ఏర్పాటైన సుప్రీం కమిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించిన పలు షాపులను, వాణిజ్య కేంద్రాలను మస్కట్ మున్సిపాలిటి అధికారులు మూసివేయించారు. షాపులు, వాణిజ్య కేంద్రాల్లో ఖచ్చితంగా సుప్రీం కమిటీ సూచనలను పాటించాల్సిందేనని మరోసారి అధికారులు హెచ్చరించారు. తమ తనిఖీలు కొనసాగుతూనే ఉంటాయని..ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే షాపులను సీజ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com