ఇండియా-యూఏఈ మధ్య ఒప్పందం..ఈ నెల 12 నుంచి విమానాలకు అనుమతి
- July 09, 2020
ఇండియా నుంచి యూఏఈ తిరిగి వచ్చేందుకు సిద్ధమైన ప్రయాణికులకు ఎట్టకేలకు ఊరట కలిగించే నిర్ణయం వెలువడింది. ఇండియా నుంచి యూఏఈకి విమాన సర్వీసులకు సంబంధించి కొన్ని షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది భారత విమానయాన సంస్థ. భారత్-యూఏఈ ప్రభుత్వాల మధ్య ఉన్న సన్నిహిత, వ్యూహాత్మక స్నేహబంధానికి అనుగుణంగా ఇరు దేశాల ప్రభుత్వాలు విమాన సర్వీసులపై ఓ అవగాహనకు వచ్చాయి. ఈ నెల 12 నుంచి 15 రోజుల పాటు విమాన సర్వీసులను నడిపేందుకు ఐసీఏ అనుమతి ఇచ్చింది. అయితే..కొన్ని షరతులను కూడా జోడించింది. యూఏఈలో చిక్కుకుపోయిన ప్రవాస భారతీయులను భారత్ కు తీసుకొచ్చే యూఏఈ ఛార్టెడ్ ఫ్లైట్స్...తిరిగి ఇండియా నుంచి యూఏఈకి వెళ్లాలనుకుంటున్న యూఏఈ రెసిడెన్సీ వీసాదారులను తీసుకువెళ్లేలా అనుమతి ఇచ్చింది. అలాగే వందే భారత్ మిషన్ లో భాగంగా యూఏఈ నుంచి ప్రవాస భారతీయులను ఇండియా తీసుకొచ్చేందుకు విమాన సర్వీసులను నడిపిన సంస్థలు కూడా ప్రస్తుతం భారత్ నుంచి యూఏఈకి విమానాలను నడిసేందుకు ఐసీఏ అనుమతి ఇచ్చింది. అంటే యూఏఈ నుంచి భారత్ కు వచ్చే విమానాలకు మాత్రమే తిరిగి యూఏఈకి ప్రయాణికులను తీసుకువెళ్లే వెసులుబాటు ఉంటుంది. అది కూడా యూఏఈ వెళ్లే వారి కోసం మాత్రమే ప్రస్తుత అవగాహణ ఒప్పందం అమలు కానుంది. ఈ నెల 12 నుంచి 26 వరకు మొత్తం 15 రోజుల పాటు విమానాలకు అనుమతి ఉంటుంది. ఆ తర్వాత పరిస్థితిని బట్టి నిర్ణయాన్ని సమీక్షించుకునే అవకాశాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







