కాగ్నిజెంట్ ఇండియా ఛైర్మన్ రామ్కుమార్ రాజీనామా
- July 10, 2020
అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ బహుళ జాతి సంస్థ కాగ్నిజెంట్ కంపెనీ నుంచి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న రామ్ కుమార్రామమూర్తి తన పదవులకు రిజైన్ చేశారు. భారతదేశంలో సుమారు 2 లక్షల మంది ఉద్యోగులను కలిగివున్న కాగ్నిజెంట్ ఇండియా కంపెనీలో సుమారు 23 ఏండ్ల పాటు పనిచేసిన రామ్కుమార్ తన పదవుల నుంచి వైదొలిగారు. కాగ్నిజెంట్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పదవులకు ఆయన రాజీనామా చేశారు. కాగ్నిజెంట్ సీఈవో బ్రియాన్ హంప్రీస్ ఈ విషయాన్ని శుక్రవారం వెల్లడించారు. రామ్ కుమార్ రామ్ కుమార్ సంస్థ ఉన్నతికి చాలా కృషి చేశారని ఆయన తెలిపారు. ఇక కంపెనీలో 24 ఏండ్లపాటు పనిచేసిన కాగ్నిజెంట్ గ్లోబల్ డెలివరీ హెడ్ ప్రదీప్ షిలిగే కూడా సెప్టెంబర్ 30న వైదొలగనున్నారు.
ఉద్యోగులకు పంపిన ఈమెయిల్లో ఈ విషయాన్ని సీఈఓ బ్రియాన్ వెల్లడించారు. ప్రదీప్ కుటుంబంతో మరింత సమయం గడపాలని కోరుకుంటున్నారని, తదుపరి సవాల్ కు సిద్ధమయ్యారని తెలిపారు. కాగా, ప్రదీప్ షిలిగే బాధ్యతలను ఆండీ స్టాఫోర్డ్ చేపట్టనున్నట్లు తెలిపారు. కాగ్నిజెంట్ సంస్థ నుంచి వీరిద్దరు వైదొలగడంతో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. కరోనా మహమ్మారి కాలంలోనూ కాగ్నిజెంట్ సంస్థ మంచి ఫలితాలను సాధించిందని, ఇప్పటికే తమ సంస్థ అనేక దేశాల్లో సేవలందిస్తున్నదని బ్రియాన్ తెలిపారు. ప్రపంచంలో తమ కంపెనీ బ్రాండ్ విలువ కూడా భారీగా పెరిగిందని పేర్కొన్నారు. ప్రపంచం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా.. తమ సంస్థ సేవలను అందిస్తూనే ఉన్నదని ఉద్యోగులకు పంపిన ఈమెయిల్లో బ్రియాన్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







