సైబరాబాద్:పోలీసు కుటుంబాలతో సీపీ వీసీ సజ్జనార్ వీడియో కాన్ఫరెన్స్
- July 11, 2020
సైబరాబాద్:కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పోలీసు కుటుంబ సభ్యులు సమాజహితం కోసం మరింత విశ్వాసంతో, నిర్మాణాత్మకంగా ఆలోచించాలని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ తెలిపారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 500 మంది పోలీసు కుటుంబ సభ్యులతో ఆయన శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కరోనాను ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరూ మానసికంగా బలంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా పోలీసుల కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితులు, యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఉప్పు నీరు, గోరు వెచ్చని తాగడం, తాజా ఆహారాన్ని తీసుకోవడం, విటమిన్ టాబ్లెట్లు తీసుకోవాలని సూచించారు. ఏమైనా లక్షణాలు కన్పిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలన్నారు. భౌతిక దూరం పాటించడం, మాస్క్లు ధరించడం, రోగనిరోధక శక్తిని పెంచుకునే మార్గాలను అనుసరించాలని సీపీ తెలిపారు.


తాజా వార్తలు
- ఇరాన్ తాజా దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- 70 మంది నర్సులను సత్కరించిన ఇండియన్ లేడీస్ అసోసియేషన్..!!
- కువైట్, బీరుట్ కు సర్వీసులను నిలిపివేసిన సలామ్ ఎయిర్..!!
- వర్క్ ప్లేస్ లో హీట్ స్ట్రెస్ ఎదుర్కోవడానికి MoPH టిప్స్..!!
- తాజా పరిణామాల పై సౌదీ క్రౌన్ ప్రిన్స్, లెబనాన్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- పిల్లల స్పోర్ట్స్ ట్రైనింగ్ పై హీట్ స్ట్రెస్ ఎఫెక్ట్..పేరెంట్స్, డాక్టర్లు ఆందోళన..!!
- తాత్కాలికంగా మూసివేసిన గగనతలాన్ని తిరిగి తెరిచిన కువైట్
- ఢిల్లీ అగ్నిప్రమాదం కేసులో హోటల్ వంటవాడు అరెస్ట్
- NRIలకు శుభవార్త..ఆ రూల్ మార్చేసిన టీటీడీ
- ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ నిరసన..పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు









