మస్కట్: సివిల్ స్టేటస్ ఆఫీస్ కు వెళ్లకుండానే ప్రవాసీయులకు రెసిడెన్సీ రెన్యూవల్స్
- July 11, 2020
మస్కట్:రెసిడెన్సీ కార్డుల రెన్యూవల్ చేసుకోవాలనుకుంటున్న ప్రవాసీయులు పాస్ పోర్ట్, సివిల్ స్టేటస్ డైరెక్టర్ జనరల్ ఆఫీసుకు రానవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రవాస ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల వేలి ముద్రలు ఇప్పటికే సివిల్ స్టేటస్ ఆఫీసులో స్టోర్ అయి ఉన్నాయని..వాటి ఆధారంగా రెన్యూవల్ చేస్తున్నట్లు వెల్లడించారు. అంతేకాదు..రెన్యూవల్ గడువు దాటిన వారికి జరిమానాల నుంచి జులై 15 వరకు మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం రెసిడెన్సీ కార్డు రెన్యూవల్ చేయాలనుకునే వారు ఎలాంటి ఫైన్లు చెల్లించాల్సిన అవసరం లేదని, అలాగే ఎలాంటి డాక్యుమెంట్లు ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదని కూడా సివిల్ స్టేటస్ కార్యాలయ అధికారులు వివరించారు. ఇదిలాఉంటే..పలు డాక్యుమెంట్ల జారీ కోసం అన్ని గవర్నరేట్లలోని స్థానిక పోలీస్ స్టేషన్లలోనే సేవా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మస్కట్ విషయానికి వస్తే అల్ దఖిలియా గవర్నరేట్లోని అల్ హమ్రా పోలీస్ స్టేషన్, ధోఫర్ గవర్నరేట్లోని మార్ముల్ పోలీస్ స్టేషన్లతో పాటు కొత్తగా అల్ ఖౌద్, అల్ అమెరాట్, మాబెలా, ఖురియాత్ పోలీస్ స్టేషన్లలో సేవా కేంద్రాలను ప్రారంభించింది. ఈ సేవా కేంద్రాల్లో రాయల్ ఒమన్ పోలీస్ నుంచి జారీ చేయబడిన డ్రైవింగ్ లైసెన్స్, వాహనాల రిజిస్ట్రేషన్లు, పాస్ పోర్ట్ రెన్యూవల్, ఐడీ/రెసిడెన్సీ కార్డులను కలెక్ట్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?