బంగారం అక్రమ రవాణా కేసు...NIA కు చిక్కిన కీలక నిందితులు

- July 12, 2020 , by Maagulf
బంగారం అక్రమ రవాణా కేసు...NIA కు చిక్కిన కీలక నిందితులు

తిరువనంతపురం:కేరళలో తీవ్ర కలకలం సృష్టించిన బంగారం అక్రమ రవాణా కేసును...  కేంద్ర హోంశాఖ జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు అప్పగించిన సంగ‌తి తెలిసిందే.. కేరళలో జులై 4న యూఏఈ ఎంబసీకి చెందిన పార్శిల్లో... 15 కోట్ల రూపాయల విలువైన 30 కేజీల బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దౌత్య కార్యాలయానికి చెందిన ప్యాకేజీలో బంగారం దొరకడం దేశవ్యాప్తంగా సంచలనమైంది.  సీఎం ఆఫీస్‌లోని ప్రధాన కార్యదర్శిపై కూడా ఆరోపణలు రావడం, ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను ప్ర‌తిప‌క్షాలు టార్గెట్ చేయ‌డంతో.. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని... ప్రధాని న‌రేంద్ర‌ మోడీకి లేఖ కూడా రాశారు కేర‌ళ సీఎం.. దీంతో.. కేంద్ర హోంశాఖ NIAను రంగంలోకి దించింది. అయితే.. శుక్ర‌వారం రంగంలోకి దిగిన NIA.. 24 గంటలు గడవకముందే ప్రధాన నిందితురాలు స్వప్నా సురేష్‌​, మరో నిందితుడు సందీప్​ నాయర్​లను అరెస్ట్ చేశారు. ఇవాళ బెంగుళూరులోని బీటీఎం లేఔట్ ద‌గ్గ‌ర‌ గోల్డ్ స్కాంలో ప్రధాన నిందితులు  స్వప్న , నాయర్ ను అరెస్ట్ చేశారు.... వెంట‌నే వారిని కొచ్చికి తరలిస్తున్నారు .. రేపు ఉదయం  వాళ్ల‌ను కోర్టులో హాజ‌రు ప‌ర్చే అవ‌కాశాలున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com