బంగారం అక్రమ రవాణా కేసు...NIA కు చిక్కిన కీలక నిందితులు
- July 12, 2020
తిరువనంతపురం:కేరళలో తీవ్ర కలకలం సృష్టించిన బంగారం అక్రమ రవాణా కేసును... కేంద్ర హోంశాఖ జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు అప్పగించిన సంగతి తెలిసిందే.. కేరళలో జులై 4న యూఏఈ ఎంబసీకి చెందిన పార్శిల్లో... 15 కోట్ల రూపాయల విలువైన 30 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దౌత్య కార్యాలయానికి చెందిన ప్యాకేజీలో బంగారం దొరకడం దేశవ్యాప్తంగా సంచలనమైంది. సీఎం ఆఫీస్లోని ప్రధాన కార్యదర్శిపై కూడా ఆరోపణలు రావడం, ముఖ్యమంత్రి పినరయి విజయన్ను ప్రతిపక్షాలు టార్గెట్ చేయడంతో.. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని... ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ కూడా రాశారు కేరళ సీఎం.. దీంతో.. కేంద్ర హోంశాఖ NIAను రంగంలోకి దించింది. అయితే.. శుక్రవారం రంగంలోకి దిగిన NIA.. 24 గంటలు గడవకముందే ప్రధాన నిందితురాలు స్వప్నా సురేష్, మరో నిందితుడు సందీప్ నాయర్లను అరెస్ట్ చేశారు. ఇవాళ బెంగుళూరులోని బీటీఎం లేఔట్ దగ్గర గోల్డ్ స్కాంలో ప్రధాన నిందితులు స్వప్న , నాయర్ ను అరెస్ట్ చేశారు.... వెంటనే వారిని కొచ్చికి తరలిస్తున్నారు .. రేపు ఉదయం వాళ్లను కోర్టులో హాజరు పర్చే అవకాశాలున్నాయి.
తాజా వార్తలు
- ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ నిరసన..పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు
- UNFCCC ఫ్రేమ్వర్క్ లో చేరిన లూసైల్ ఇంటర్నేషనల్ సర్క్యూట్..!!
- యువ ఆవిష్కర్తల గొప్ప ఆలోచనలు..!!
- భద్రత, రక్షణ సంబంధాలపై కువైట్, జోర్డాన్ చర్చలు..!!
- ఇంపోర్టెట్ గూడ్స్ కు ప్యాలెట్ల వినియోగం తప్పనిసరి..!!
- ఎబోలా ప్రభావిత దేశాలకు వీసాలను నిలిపివేసిన యూఏఈ..!!
- సౌదీలో విజిల్బ్లోయర్లు, సాక్షులు, బాధితుల ప్రొటెక్షన్ ప్రోగ్రామ్..!!
- నార్వే చెస్ చాంపియన్ ప్రజ్ఞానంద.. తొలి భారతీయుడిగా సరికొత్త రికార్డు!
- ఇరాన్ పై మరోసారి అమెరికా దాడులు
- ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ గా నీల్ కాంత్ మిశ్రా









