యూఏఈ:మార్చి, ఏప్రిల్ తో గడువు ముగిసిన వీసాలను తక్షణమే రెన్యూవల్ చేసుకోవాల్సిందే!
- July 12, 2020
యూఏఈ:రెసిడెన్సీ వీసా, ఎమిరేట్స్ ఐడీ కార్డుల జారీ, రెన్యూవల్ కు సంబంధించి కొత్త విధి విధానాలను ప్రకటించిన యూఏఈ..మార్చి, ఏప్రిల్ నెలల్లో గడువు ముగిసిన వీసాలను తక్షణమే రెన్యూవల్ చేసుకోవాలని ఆదేశించింది. ఇందుకు సంబంధించి ఫెడరల్, సిటిజన్ షిప్ ఫెడరల్ అథారిటీ వీసా రెన్యూవల్ దరఖాస్తులను ఆదివారం (జులై 12) స్వీకరిస్తున్నట్లు వెల్లడించింది. అయితే..కరోనా ప్రభావం నేపథ్యంలో ICA కేంద్రాల్లో రద్దీని నియంత్రించేందుకు దశల వారీగా రెన్యూవల్ చేస్తున్నట్లు అధికారులు వివరించారు. మేతో గడువు ముగిసే రెసిడెన్సీ వీసాలను ఆగస్టు 8 నుంచి...జూన్, జులై 11 నాటికి గడువు ముగిసే రెసిడెన్సీ వీసాలను సెప్టెంబర్ 10 నుంచి ప్రాసెస్ చేయనున్నారు. ఇక ఇప్పటికే యూఏఈలో ఉండి రెసిడెన్సీ గడువు ముగిసిన వారికి మూడు నెలల మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







