యూఏఈ:మార్చి, ఏప్రిల్ తో గడువు ముగిసిన వీసాలను తక్షణమే రెన్యూవల్ చేసుకోవాల్సిందే!
- July 12, 2020
యూఏఈ:రెసిడెన్సీ వీసా, ఎమిరేట్స్ ఐడీ కార్డుల జారీ, రెన్యూవల్ కు సంబంధించి కొత్త విధి విధానాలను ప్రకటించిన యూఏఈ..మార్చి, ఏప్రిల్ నెలల్లో గడువు ముగిసిన వీసాలను తక్షణమే రెన్యూవల్ చేసుకోవాలని ఆదేశించింది. ఇందుకు సంబంధించి ఫెడరల్, సిటిజన్ షిప్ ఫెడరల్ అథారిటీ వీసా రెన్యూవల్ దరఖాస్తులను ఆదివారం (జులై 12) స్వీకరిస్తున్నట్లు వెల్లడించింది. అయితే..కరోనా ప్రభావం నేపథ్యంలో ICA కేంద్రాల్లో రద్దీని నియంత్రించేందుకు దశల వారీగా రెన్యూవల్ చేస్తున్నట్లు అధికారులు వివరించారు. మేతో గడువు ముగిసే రెసిడెన్సీ వీసాలను ఆగస్టు 8 నుంచి...జూన్, జులై 11 నాటికి గడువు ముగిసే రెసిడెన్సీ వీసాలను సెప్టెంబర్ 10 నుంచి ప్రాసెస్ చేయనున్నారు. ఇక ఇప్పటికే యూఏఈలో ఉండి రెసిడెన్సీ గడువు ముగిసిన వారికి మూడు నెలల మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ నిరసన..పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు
- UNFCCC ఫ్రేమ్వర్క్ లో చేరిన లూసైల్ ఇంటర్నేషనల్ సర్క్యూట్..!!
- యువ ఆవిష్కర్తల గొప్ప ఆలోచనలు..!!
- భద్రత, రక్షణ సంబంధాలపై కువైట్, జోర్డాన్ చర్చలు..!!
- ఇంపోర్టెట్ గూడ్స్ కు ప్యాలెట్ల వినియోగం తప్పనిసరి..!!
- ఎబోలా ప్రభావిత దేశాలకు వీసాలను నిలిపివేసిన యూఏఈ..!!
- సౌదీలో విజిల్బ్లోయర్లు, సాక్షులు, బాధితుల ప్రొటెక్షన్ ప్రోగ్రామ్..!!
- నార్వే చెస్ చాంపియన్ ప్రజ్ఞానంద.. తొలి భారతీయుడిగా సరికొత్త రికార్డు!
- ఇరాన్ పై మరోసారి అమెరికా దాడులు
- ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ గా నీల్ కాంత్ మిశ్రా









