2 KD చెల్లిస్తే సివిల్ ఐడీ కార్డుల హోండెలివరి అంటూ మోసాలు..
- July 12, 2020
కువైట్ సిటీ:కువైట్ సివిల్ ఐడీ కార్డుల మోసాలపై పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రకటన విడుదల చేశారు. 2 కువైట్ దినార్ లు చెల్లిస్తే చాలు..సవిల్ ఐడీ కార్డులను ఇంటికే పంపిస్తామంటూ ఇటీవల సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఒకే చిరునామా ఒకటి కంటే ఎక్కువ కార్డులు పంపిస్తే ఒక్కో కార్డుపై అదనంగా క్వార్టర్ దినార్ చెల్లిస్తే చాలంటూ కొందరు ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో ప్రజలను అప్రమత్తం చేసేందుకు సివిల్ కార్డుల హోం డెలివరిపై పీఏసీఐ స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది. తాము ప్రస్తుతానికి సివిల్ కార్డులను హోం డెలివరి చేయటం లేదని, ఇప్పుడు కేవలం హోండెలివరి బిడ్డింగ్ దశలోనే ఉందని తెలిపింది. కార్డుల హోం డెలివరి ఫీజులు, విధివిధానాలపై ఇంకా ఏ నిర్ణయానికి రాలేదని..ప్రజలు ఎవరూ సోషల్ మీడియాలో పోస్టులను నమ్మి మోసపోవద్దని వెల్లడించింది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







