2 KD చెల్లిస్తే సివిల్ ఐడీ కార్డుల హోండెలివరి అంటూ మోసాలు..
- July 12, 2020
కువైట్ సిటీ:కువైట్ సివిల్ ఐడీ కార్డుల మోసాలపై పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రకటన విడుదల చేశారు. 2 కువైట్ దినార్ లు చెల్లిస్తే చాలు..సవిల్ ఐడీ కార్డులను ఇంటికే పంపిస్తామంటూ ఇటీవల సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఒకే చిరునామా ఒకటి కంటే ఎక్కువ కార్డులు పంపిస్తే ఒక్కో కార్డుపై అదనంగా క్వార్టర్ దినార్ చెల్లిస్తే చాలంటూ కొందరు ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో ప్రజలను అప్రమత్తం చేసేందుకు సివిల్ కార్డుల హోం డెలివరిపై పీఏసీఐ స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది. తాము ప్రస్తుతానికి సివిల్ కార్డులను హోం డెలివరి చేయటం లేదని, ఇప్పుడు కేవలం హోండెలివరి బిడ్డింగ్ దశలోనే ఉందని తెలిపింది. కార్డుల హోం డెలివరి ఫీజులు, విధివిధానాలపై ఇంకా ఏ నిర్ణయానికి రాలేదని..ప్రజలు ఎవరూ సోషల్ మీడియాలో పోస్టులను నమ్మి మోసపోవద్దని వెల్లడించింది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?