2 KD చెల్లిస్తే సివిల్ ఐడీ కార్డుల హోండెలివరి అంటూ మోసాలు..
- July 12, 2020
కువైట్ సిటీ:కువైట్ సివిల్ ఐడీ కార్డుల మోసాలపై పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రకటన విడుదల చేశారు. 2 కువైట్ దినార్ లు చెల్లిస్తే చాలు..సవిల్ ఐడీ కార్డులను ఇంటికే పంపిస్తామంటూ ఇటీవల సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఒకే చిరునామా ఒకటి కంటే ఎక్కువ కార్డులు పంపిస్తే ఒక్కో కార్డుపై అదనంగా క్వార్టర్ దినార్ చెల్లిస్తే చాలంటూ కొందరు ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో ప్రజలను అప్రమత్తం చేసేందుకు సివిల్ కార్డుల హోం డెలివరిపై పీఏసీఐ స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది. తాము ప్రస్తుతానికి సివిల్ కార్డులను హోం డెలివరి చేయటం లేదని, ఇప్పుడు కేవలం హోండెలివరి బిడ్డింగ్ దశలోనే ఉందని తెలిపింది. కార్డుల హోం డెలివరి ఫీజులు, విధివిధానాలపై ఇంకా ఏ నిర్ణయానికి రాలేదని..ప్రజలు ఎవరూ సోషల్ మీడియాలో పోస్టులను నమ్మి మోసపోవద్దని వెల్లడించింది.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







