నకిలీ ఎస్ఎంఎస్ లతో మోసం..రియాద్ లో పాకిస్తాన్ గ్యాంగ్ అరెస్ట్

- July 15, 2020 , by Maagulf
నకిలీ ఎస్ఎంఎస్ లతో మోసం..రియాద్ లో పాకిస్తాన్ గ్యాంగ్ అరెస్ట్

రియాద్:నకిలీ ఎస్ఎంఎస్ లతో అమాయకులను మోసం చేస్తున్న ముఠా గుట్టు రట్టైంది. మీరు క్యాష్ ప్రైజ్ గెలుచుకున్నారు..మీ బ్యాంక్ వివరాలు పంపించండి..మీ ఖాతాలో డబ్బులు జమ చేస్తాం అంటూ ఎస్ఎంఎస్ పంపిస్తారు. నమ్మి బ్యాంకు ఖాతా వివరాలు పంపించిన వారి అకౌంట్లో డబ్బు కాజేస్తారు. అంతేకాదు మీకు  ప్రీ అప్రూవల్ లోన్ మీ కోసం సిద్ధంగా ఉంది..మీ డిటేల్స్ ఇవ్వండి..డబ్బు అకౌంట్లో క్రెడిట్ అవుతుందని, ఇంకా కొన్ని సార్లు మీరు తక్షణమే మా ఎస్ఎంఎస్ కు స్పందించకుంటే మీ  బ్యాంక్ కార్డులు బ్లాక్ అవుతాయని ఇలా అయోమయానికి గురి చేసి వారి బ్యాంకు వివరాలను సేకరించి డబ్బు కాజేయం ఈ ముఠా పని. కాజేసిన సొమ్మును పాకిస్తాన్ లోని తమ బ్యాంకు అకౌంట్లోకి బదిలీ చేస్తుంటారు. ఇలా మోసం చేస్తున్న 8 మంది సభ్యులున్న పాకిస్తాన్ ముఠాను రియాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి SR 25,000, ఏటీఎం కార్డులు, 37 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com