దుబాయ్:సోషల్ మీడియాలో రూమర్లు ప్రచారం చేస్తే ఏడాది జైలు శిక్ష
- July 15, 2020
దుబాయ్:కరోనా మహమ్మారి నేపథ్యంలో సోషల్ మీడియా/వాట్సాప్లో వైరల్ అవుతున్న అపోహ ప్రచారాల పట్ల దుబాయ్ పాలకవర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక నుంచి ఎవరైనా సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారం చేస్తే ఏడాది పాటు జైలు శిక్ష ఎదుర్కొవాల్సి వస్తుందని దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ వార్నింగ్ ఇచ్చింది. కరోనా మహమ్మారితో ఇప్పటికే జనంలో ఆందోళన నెలకొనగా..కొందరు వ్యక్తులు అనవసర మేసేజ్ లతో ప్రజలను మరింత భయపెడుతున్నారన్నది పబ్లిక్ ప్రాసిక్యూషన్ వాదన. ఇక నుంచి ఎవరైనా సోషల్ మీడియా లేదా వాట్సాప్లో ఒక మేసేజ్ ను ఇతరులకు ఫార్వార్డ్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలని సూచించింది. సంబంధిత శాఖ అధికారిక వివరాలతో సరిపోల్చుకోకుండా..పూర్తిగా నిరాధారమైన వివరాలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఇతరులకు షేర్ చేయొద్దని హెచ్చరించింది. ప్రజలను భయాందోళనలకు గురిచేసేందుకు కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా మిమ్ములను ఓ సాధానంగా వాడుకోవచ్చని, అలాంటి మేసేజ్ పట్ల అప్రమత్తంగా ఉండితీరాల్సిందేనని సూచించింది. ఒక్కసారి ఓ వ్యక్తి నుంచి మేసేజ్ ఇతరులకు ఫార్వార్డ్ అయితే..దానికి పూర్తి ఆ వ్యక్తిదేనని స్పష్టతనిచ్చింది. తమకు తెలియకుండా ఫార్వార్డ్ చేశామని చెప్పినా ఆ వాదనలు చెల్లవని కూడా వెల్లడించింది. రూమర్లను వైరల్ చేసిన వ్యక్తులపై నిస్సందేహంగా కఠిన చర్యలు తీసుకుంటామని దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







